PUSHPA 2 STORY: “పుష్ప రాజ్” జపాన్ కి వెళ్తాడా.?

PUSHPA 2 STORY: “పుష్ప రాజ్” జపాన్ కి వెళ్తాడా.?

by Mounika Singaluri

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాకి వచ్చిన క్రేజ్ ని కాపాడుకునే విధంగా పుష్ప2 ని రూపొందిస్తున్నారు.

Video Advertisement

దీనికోసం 400 కోట్ల పై బడి బడ్జెట్ ను కేటాయించారు. సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సుకుమార్ కూడా తను అనుకున్నది వచ్చేవరకు నిద్రపోని డైరెక్టర్. నిర్మాతలు కూడా డైరెక్టర్ కి పూర్తి సహకారం అందిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న పుష్ప 2 విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .. కథ ప్రకారం పుష్పరాజ్ ఎర్రచందనం రవాణాకు సంబంధించి ఒక డీల్ మాట్లాడేందుకు జపాన్ వెళ్తాడట. అక్కడి డాన్ లతో తీరా ఒప్పందం కుదిరే టైంలో అక్కడున్న గ్యాంగ్ కుట్ర చేయడంతో అక్కడే చిక్కుకుంటాడు. ఊహించని విధంగా కింగ్ పిన్ ని అక్కడే చంపేసే ఎపిసోడ్ హైలైట్ అవుతుంది అంట. మరి అది నిజమో కాదో చూడాలి.


End of Article

You may also like