ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసు విషయంలో ఇవ్వాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10:30 కార్యాలయానికి రావలసిందిగా అధికారులు నోటీసులు పంపగా మాత్రం 9:10 నిమిషాలకు కార్యాలయానికి చేరుకున్నారు. రకుల్ తో పాటు చార్టెడ్ అకౌంటెంట్ న్యాయవాది కూడా వెళ్లారు.
Video Advertisement
ఇందులో రకుల్ ని 6 గంటలు విచారణ చేసినట్టు సమాచారం. పలు అనుమానాస్పద ఆస్తులపై వివరాలు అడిగారు. అలాగే డ్రగ్ పెడ్లర్ కెల్విన్ తెలుసా అని అడగగా రకుల్ ప్రీత్ సింగ్ తెలియదు అని సమాధానం చెప్పారు. ఈ కేసులో ఈ నెల 8వ తేదీన రానా దగ్గుబాటి, ఆ తర్వాత మరికొంతమంది సెలెబ్రిటీలు విచారణకు హాజరు అవ్వడం ఉన్నారు. వీరిలో రవితేజ, శ్రీనివాస్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ ఉన్నారు.