Ads
ఆర్ఆర్అర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. గ్లోబల్ స్టార్ అంటూ ఆయనకి పేరువచ్చింది.ఒక పక్క మెగా లెగసీ కంటిన్యూ చేస్తూనే తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.సినిమాలు, బిజినెస్ ఇలా తీరిక లేకుండా చెర్రీ గడుపుతున్నారు.
Video Advertisement
మరో పక్క చెర్రీ భార్య ఉపాసన కూడా అపోలో సంస్థలో బాధ్యతలు చూస్తూనే సోషల్ సర్వీస్ చేస్తూ సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు వీరిద్దరూ కూడా ప్రస్తుతం తమ కూతురు క్లింకార తో టైం స్పెండ్ చేస్తూ ముంబై లో ఉన్నారు.ముంబై లో ఉన్న అన్ని ఆలయాలు సందర్శించారు.
తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకానాథ్ షిండే ఇంటికి రామ్ చరణ్ దంపతులు ముఖ్య అతిథులుగా వెళ్లారు.దానికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ఇచ్చారు. అందులో చరణ్ ఉపాసన, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చోవడం ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరి ఫోటోను షేర్ చేస్తూ కవర్ పేజీపై ప్రశంసలతో ముంచెత్తారు.
రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.ఇది 2024 లో షూటింగ్ ప్రారంభం కానుంది.
End of Article