Ads
రమాప్రభ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హాస్య నటీమణిగా పేరు తెచ్చుకున్నారు. హాస్యాన్ని రమ ప్రభ పండించడంలో నెంబర్ వన్ అని చెప్పొచ్చు. రమాప్రభ దివంగత నటుడు రాజబాబుతో కలిసి 300 కి పైగా సినిమాల్లో నటించారు.
Video Advertisement
అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ కి మామూలు క్రేజ్ ఉండేది కాదు. అల్లు రామలింగయ్య, రమణారెడ్డి వంటి గొప్ప నటులుతో కూడా ఈమె నటించారు.
అలానే కమెడియన్ రేలంగి తో కూడా కలిసి కామెడీ చేశారు రమాప్రభ. అయితే సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రమాప్రభ శరత్ బాబుని వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 13 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని సాగించారు. కానీ ఆ తరువాత మనస్పర్థాల కారణంగా విడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమె పలు సినిమాల్లో నటించడం అందర్నీ అలరించడం జరిగింది.
గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి షాకింగ్ విషయాలు ఆమె తెలియజేయడం జరిగింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు కూడా. నటకిరీటి రాజేంద్రప్రసాద్ తనకి అల్లుడు అని ఆమె అన్నారు. ఏడాది వయసులో ఉన్న తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని రమాప్రభ దత్తత తీసుకున్నారని… ఆమెను రాజేంద్రప్రసాద్ కి ఇచ్చి పెళ్లి చేశారని ఆమె అన్నారు.
అదే విధంగా మా అసోసియేషన్ వల్ల తాను ఎన్నో అవమానాలకు గురయ్యారు అని కూడా ఆమె అన్నారు. అయితే తాను చనిపోయినా ఆ విషయాన్ని మా అసోసియేషన్ కి ఎవరూ చెప్పవద్దని ఇంటర్వ్యూలో ఆమె చెప్పి కంటతడి పెట్టించారు. ఆమెకి సముచిత గౌరవం ఇవ్వలేదని మా అసోసియేషన్ వారు ఇవ్వలేదని.. తనని అవమానించడం జరిగిందని అన్నారు.
End of Article