సెలబ్రిటీస్ అందరూ ఒకేసారి “మాల్దీవ్స్” ట్రిప్ కి వెళ్లడం వెనక ఇంత కథ ఉందా.? అసలు సీక్రెట్ ఇదన్నమాట.?

సెలబ్రిటీస్ అందరూ ఒకేసారి “మాల్దీవ్స్” ట్రిప్ కి వెళ్లడం వెనక ఇంత కథ ఉందా.? అసలు సీక్రెట్ ఇదన్నమాట.?

by Megha Varna

Ads

మామూలుగా కొంత ఖాళీ సమయం దొరికితే ఎక్కడికైనా వెళుతూ ఉంటారు. అదే కొంచెం ఎక్కువ సమయం ఉంటే, లేదా బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు హాలిడే ట్రిప్ కి వెళుతుంటారు. మన సెలబ్రిటీలు కూడా మధ్యమధ్యలో హాలిడే కి వెళ్లి వస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే. ఇందులో కొత్త ఏముంది? అని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. ఈసారి కూడా చాలా మంది సెలబ్రెటీలు హాలిడే కి వెళ్లారు. ఈ విషయం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్లు అందరూ చూసే ఉంటారు.

Video Advertisement

మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా కొంత మంది సెలబ్రిటీలు కూడా ఇటీవల సమయంలో హాలిడే కి వెళ్లారు. ఇందులో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత వెళ్లిన ప్రదేశం ఒకటే. అదే మాల్దీవ్స్. వీళ్లు మాత్రమే కాకుండా లవ్లీ సినిమాలో నటించిన శాన్వి, దిశా పటాని, ప్రణీత, ఇటీవల మెహరీన్, కూడా మాల్దీవ్స్ కి హాలిడేకి వెళ్లారు. మామూలుగా బెస్ట్ హాలిడే ప్రదేశాలలో మాల్దీవ్స్ ఒకటి. చాలా మంది మాల్దీవ్స్ కి వెళ్లడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కానీ సడన్ గా ఇంత మంది సెలబ్రిటీలు దగ్గర దగ్గర ఒకే సారి మాల్దీవ్స్ కి వెళ్లడంపై ఇలా మీమ్స్ ట్రెండ్ అయిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఇలా సెలబ్రిటీల మాల్దీవ్స్ ట్రిప్ వెనకున్న సీక్రెట్ ని ఓ నటుడు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు. కరోనా కారణంగా టూరిజం ఇండస్ట్రీకి ఎంత నష్టం జరిగిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీస్ కి ట్రిప్ ఆఫర్ చేసి ఇంస్టాగ్రామ్ లో అప్ డేట్స్ ఇవ్వమని అక్కడి హోటల్ వారు అడిగారట. సెలెబ్రిటీల ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూసి మరికొందరు మాల్దీవ్స్ రిసార్ట్ కి వస్తారు అనే ప్లాన్ అంట అక్కడి రిసార్ట్ ఓనర్ల ఇది. బహుశా ఇందుకే అనుకుంట మన హీరో హీరోయిన్లు చాలామంది అక్కడి రిసార్ట్స్ లో ఫోటోషూట్స్ చేసి అవి వారి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలు చూసి చాలామందే మాల్దీవ్స్ కి ట్రిప్ వేయాలి అనుకుంటున్నారట.


End of Article

You may also like