346
లాక్ డౌన్ కారణంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సైతం ప్రజలకు కోసం అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. మాస్కుల ఉత్పత్తి, జీవనాధారం కోల్పోయిన వారికి ఉచిత భోజనం, ఎమర్జెన్సీ వాహనాలకు ఉచిత ఇంధనం, 100 పడకల ఆసుపత్రి నిర్మించడంతో పాటు తమ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్ధికంగా సహాయం చేసారు, లాక్ డౌన్ కారణంగా నెల జీతం 30 వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు నెలలో రెండు సార్లు జీతం ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్స్ట్రీస్ నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తమ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులూ పడకూడదు అని సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

