Ads
ఈ టీవీలో వినాయక చవితి ఈ సందర్భంగా ఊరిలో వినాయకుడు ప్రోగ్రాం ప్రసారం అవ్వబోతోంది. ఈ ప్రోగ్రాం కి సుధీర్, రష్మీ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన కొన్ని ప్రోమోలు ఇటీవల విడుదలయ్యాయి. ఇవాళ మరొక ప్రోమో విడుదల అయింది. ఇందులో సుధీర్, రష్మీ, వర్ష వాళ్ళ ఇంటికి, అలాగే ఆటో రామ్ ప్రసాద్, రోహిణి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్లారు. ఈ ఈవెంట్ కి నటులు శ్రీకాంత్, రాజ్ తరుణ్ అలాగే ఇంకా కొంత మంది అతిథులుగా రాబోతున్నారు.
Video Advertisement
వీరు మాత్రమే కాకుండా, జబర్దస్త్ ఆర్టిస్ట్ ల పిల్లలు కూడా ఈ ప్రోగ్రాంలో స్కిట్ లో కనిపించబోతున్నారు. రోజా గారి పిల్లలు కూడా ఈ ప్రోగ్రాం కి గెస్ట్ లుగా వస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో, రోజా గారు తనకు జరిగిన ఒక సంఘటన గురించి వివరించారు. తనకి గర్భవతి కావడం కష్టమని డాక్టర్లు చెప్పేసారు అని, కానీ సంవత్సరం తర్వాత తను గర్భవతి అయ్యాను అని, అప్పుడే తన కూతురు పుట్టింది అని చెప్పారు. అందుకే తన కూతురు అన్షు మాలిక అంటే తనకు చాలా ఇష్టమని ఎమోషనల్ అయ్యారు రోజా గారు. ప్రోగ్రాంలో ఇంద్రజ గారు కూడా పాల్గొంటున్నారు.
watch video :
https://youtu.be/F640cYIzkNg
End of Article