ఆ కారణంతో… 3వ అంతస్తుకి వెళ్లి..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

ఆ కారణంతో… 3వ అంతస్తుకి వెళ్లి..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

by Megha Varna

Ads

రోజు రోజుకి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నా, ఎంతో అభివృద్ధి జరుగుతున్నా ఇలాంటి సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. చాలా మంది స్త్రీలు కట్నం వేధింపుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆఖరికి మరణమే సమాధానం అనుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు.

Video Advertisement

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అదనపు కట్నం, వేధింపులు భరించ లేక ఈమె ఆత్మహత్య చేసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… సాక్షి కథనం ప్రకారం, 2016 లో వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగా దేవి కుమార్తె వెంకట సుజనని ధర్మవరం లోని నేసేపేటకి చెందిన వెంకట కృష్ణ తో వివాహం చేశారు. వెంకట కృష్ణ బ్యాంకు ఉద్యోగి. పెళ్లి కి 18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలు అబ్బాయికి ఇచ్చారు.

అయితే కొన్నేళ్ల పాటు వీళ్ళ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళ జీవితం సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కొంత కాలం నుండి కూడా వీళ్ళ మధ్య ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది. ఇక వీటన్నిటినీ తట్టుకో లేక శనివారం అర్ధ రాత్రి దాటాక మూడో అంతస్తులో సుజన ఉరి వేసుకుని చనిపోయింది. పోస్టుమార్టం నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అదనపు కట్నం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే తన కుమార్తెని అదనపు కట్నం కోసం వేధించి హతమార్చారని… ఆత్మహత్య చేసుకుందని నమ్మిస్తున్నారని వెంకట కృష్ణ మరియు అతని కుటుంబ సభ్యులపై మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వెంకట కృష్ణ మరియు కుటుంబ సభ్యుల పై పోలీసులు కేసు నమోదు చేశారు వారిని అదుపు లోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.


End of Article

You may also like