కరోనాతో ఆసుపత్రిలో చేరింది…ఐసీయూ లోనే తాళి కట్టించుకుంది.! కానీ చివరికి.?

కరోనాతో ఆసుపత్రిలో చేరింది…ఐసీయూ లోనే తాళి కట్టించుకుంది.! కానీ చివరికి.?

by Mohana Priya

Ads

కరోనా వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఒక 27 సంవత్సరాల యువతి కరోనాతో మరణించారు. వివరాల్లోకి వెళితే. సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన యువతి, ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడిని ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. అంతలో ఆ యువతికి కరోనా సోకింది.దాంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆ యువతిని హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

Video Advertisement

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ యువతిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాలి అని చెప్పారు వైద్యులు. వైద్యుల అనుమతితో ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతితో మాట్లాడారు. “కరోనా ను జయించి నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావని” ధైర్యాన్ని ఇచ్చారు. ఆ నిమిషమే ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఆ యువతి మెడలో తాళి కట్టారు.

“నేను నీ భర్తని నేను నేను కాపాడుకుంటాను” అని భరోసా ఇచ్చారు. వెంటిలేటర్ పై ఉన్న ఆ యువతి కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ యువతి సోదరుడు, ప్రేమించిన యువకుడు దగ్గరుండి యువతి అంత్యక్రియలు జరిపించారు. ఆమె మరణించిన విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. ఆ యువతి మరణించిన తర్వాత నుంచి తన సోదరుడు, ప్రేమించిన యువకుడు ఈ విషయాన్ని తమలోనే దాచుకుని కుమిలిపోతున్నారు.


End of Article

You may also like