Ads
తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి రామాయణం సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమాను డైరెక్టర్ చేయనున్నారు. ఈ బాలీవుడ్ రామాయణం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా మరొక వార్త ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.
Video Advertisement
ఈ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడుగా సీతగా సాయి పల్లవి నటించనుంది అనే వార్త బయటకు వచ్చింది. అయితే రావణాసురుడి పాత్రలో కేజిఎఫ్ హీరో యష్ నటించినున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నట్లు కూడా బయటకు వచ్చింది.
ఈ సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడనున్నారట.ఇప్పటికే శ్రీలంకలో భారీ సెట్లు నిర్మాణం జరుగుతుంది అనే వార్త కూడా బయటకు వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. ఇటీవల యానిమల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రణబీర్ కపూర్ త్వరలో ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అది రామాయణమే అంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ బాలీవుడ్ రామాయణం ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే
End of Article