బాలీవుడ్ రామాయణం పైన లేటెస్ట్ అప్డేట్… సీతగా సాయి పల్లవి

బాలీవుడ్ రామాయణం పైన లేటెస్ట్ అప్డేట్… సీతగా సాయి పల్లవి

by Mounika Singaluri

Ads

తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి రామాయణం సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమాను డైరెక్టర్ చేయనున్నారు. ఈ బాలీవుడ్ రామాయణం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా మరొక వార్త ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.

Video Advertisement

ఈ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడుగా సీతగా సాయి పల్లవి నటించనుంది అనే వార్త బయటకు వచ్చింది. అయితే రావణాసురుడి పాత్రలో కేజిఎఫ్ హీరో యష్ నటించినున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నట్లు కూడా బయటకు వచ్చింది.

sai-pallavi-3

ఈ సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడనున్నారట.ఇప్పటికే శ్రీలంకలో భారీ సెట్లు నిర్మాణం జరుగుతుంది అనే వార్త కూడా బయటకు వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. ఇటీవల యానిమల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రణబీర్ కపూర్ త్వరలో ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అది రామాయణమే అంటూ ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ బాలీవుడ్ రామాయణం ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే


End of Article

You may also like