సలార్ మొదట టికెట్ కొన్న ఎస్ఎస్ రాజమౌళి…

సలార్ మొదట టికెట్ కొన్న ఎస్ఎస్ రాజమౌళి…

by Mounika Singaluri

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఈనెల 22వ తారీఖున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని భారీ ఎత్తున మొదలు చేస్తున్నారు. నైజంలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ గ్రాండ్ విడుదల చేస్తుంది.

Video Advertisement

అయితే సలార్ మూవీకి సంబంధించి తెలంగాణలో మొదటి టిక్కెట్ ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొనుగోలు చేశారు. మైత్రి మూవీస్ సంస్థాజనేత నవీన్ ఈ టికెట్ ను రాజమౌళికి అందించారు. ఈ కార్యక్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , పృధ్విరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు.

అయితే సలార్ కి ఉన్న క్రేజ్ నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ టికెట్ల కోసం ఇప్పటికే పోటీ నెలకొంది. టికెట్ల రేటు పెంపు కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాతలు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అలాగే బెనిఫిట్ షోస్ కోసం కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఇప్పటికే సెన్సార్ నుండి వచ్చిన టాక్ ప్రకారం అయితే సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు


End of Article

You may also like