Ads
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.
Video Advertisement
సమంత గత కొంత కాలం నుండి సోషల్ మీడియా ద్వారా ఎన్నో కోట్స్ షేర్ చేస్తున్నారు. ఇవాళ కూడా అలాంటి ఒక కొటేషన్ షేర్ చేశారు. సమంత అందులో ఈ విధంగా రాశారు. ” నేను స్ట్రాంగ్. నేను ఎంతటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలుగుతాను. వాటి నుండి బయటికి రాగలుగుతాను. నేను పర్ఫెక్ట్ కాదు. నేను నాలాగే పర్ఫెక్ట్ గా ఉన్నాను. నేను అంత తొందరగా ఓడిపోను. నేను ప్రేమించగలను. నేను పట్టుదల ఉన్న దాన్ని. నేను ఒక మనిషిని. నేను ఒక యోధురాలిని” అని సమంత రాశారు.
సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ బట్టి చూస్తే దుబాయ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. తర్వాత మళ్ళీ హైదరాబాద్ కి తిరిగి వచ్చి సైన్ చేసిన సినిమాల షూటింగ్ మొదలుపెడతారు. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్, అలాగే ఆహాలో రెండు వెబ్ సిరీస్ కూడా సమంత చేస్తున్నారు అని సమాచారం. అలా సమంత ఇటు సినిమాలకి, అటు వెబ్ సిరీస్ కి సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.
End of Article