ఏడాది నుండి మీమ్స్ లో ట్రెండ్ అవుతున్న ఇతను ఎవరో తెలుసా? రాత్రికిరాత్రే ఎలా ఫేమస్ అయ్యారు?

ఏడాది నుండి మీమ్స్ లో ట్రెండ్ అవుతున్న ఇతను ఎవరో తెలుసా? రాత్రికిరాత్రే ఎలా ఫేమస్ అయ్యారు?

by Mohana Priya

Ads

ఓవర్ నైట్ స్టార్లు అవ్వాలంటే దాదాపు చాలామంది ఎంచుకునే దారి సోషల్ మీడియా. డాన్స్ వేస్తూనో, పాట పాడుతూనో, లేదా ఇంకా దేని గురించి అయినా మాట్లాడుతూనో ఏదో ఒక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. అంతే. తర్వాత రోజు నుండి ఫాలోవర్స్ పెరిగి పోతూ ఉంటారు, ఏ పోస్ట్ పెట్టినా కూడా వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోతారు.

Video Advertisement

ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా మంచి వీడియో అప్లోడ్ చేస్తే పొగుడుతారు, వెటకారంగా ఉండే వీడియో అప్లోడ్ చేస్తే ట్రోల్ చేస్తారు. కానీ చివరికి వాళ్ళు ఖచ్చితంగా ఫేమస్ మాత్రం అవుతారు.

కొంతమంది మాత్రం వాళ్లకు తెలియకుండానే ఇలా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోతారు. వీళ్ళకి సోషల్ మీడియా కి తూర్పు పడమర కి ఉన్నంత దూరం ఉంటుంది. కానీ వాళ్లు అనుకోకుండా చేసిన ఏదైనా ఒక పని వల్ల అలా ఫేమస్ అయిపోతారు అంతే. వివరాల్లోకి వెళితే.

ఈ పైన కనిపిస్తున్న వ్యక్తిని మీరు గుర్తుపట్టారా. “ఇతను ఎందుకు తెలీదు? చాలా మీమ్స్ లో కనిపిస్తూ ఉంటాడు”. మీలో చాలా మంది నుండి వచ్చే సమాధానం ఇదే. ఏదో కోల్పోయినట్టు నిరాశగా నిల్చున్న ఈ వ్యక్తిని నిజంగానే మీరు ఎన్నో మీమ్స్ లో చూసే ఉంటారు. ఇతని పేరు సరీం అక్తర్.

సరీం లండన్ కి చెందిన ఒక అకౌంటింగ్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఆయన పాకిస్తాన్ క్రికెట్ టీం కి పెద్ద అభిమాని. 2019లో ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కి ఆస్ట్రేలియా కి మధ్యలో జరిగిన మ్యాచ్ చూడడానికి సరీం వెళ్లారు. అలా స్టేడియంలో మ్యాచ్ చూడడం సరీం కి అదే మొదటిసారట. మూడు గంటల కంటే ఎక్కువ సేపు ప్రయాణం చేసి స్టేడియంలో ముందువరుసలో సీట్లు సంపాదించారట సరీం.

మ్యాచ్ మధ్యలో పాకిస్థానీ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఒక క్యాచ్ మిస్ చేశారట. అప్పుడు ముందు వరుసలో ఉన్న సరీం క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించారట. కానీ సరీం కూడా బంతిని పట్టుకోలేకపోయారట. అలా క్యాచ్ మిస్ అయినప్పుడు ఇలా నిరాశగా నిల్చుని ఉన్నారట. ఆ ఎక్స్ప్రెషన్ ని మ్యాచ్ చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్స్ తమ కెమెరా లో బంధించారు. అలా టీవీ లో వచ్చారు సరీం.

సరీం స్నేహితులు ఫోన్ చేసి తను టీవీ లో వచ్చిన సంగతి చెప్పారట. అప్పుడు సరీం టీవీలో వచ్చినప్పుడు ఫోటోలు తీసి పంపమని తన స్నేహితులని అడిగారట. కానీ టీవీలో వచ్చిన కొద్దిసేపటి తర్వాత నుండి సోషల్ మీడియాలో సరీం అలా నిల్చున్న ఎక్స్ప్రెషన్ వైరల్ అయింది.

దేశం, రాష్ట్రం సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ ఫోటో వైరల్ అయింది. అప్పటివరకు సరీం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారట. కానీ ఎప్పుడైతే మీమ్స్ లో తన ఫోటోలను చూశారో అప్పటినుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారట. అంతేకాకుండా మీమ్స్ తయారు చేసిన వారిని అభినందిస్తూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు సరీం.

మీమ్ పేజీలలో తన భర్త ఫోటో వైరల్ అవ్వడం చూసి కొంత ఇబ్బంది గురయ్యారట సరీం భార్య. సరీం ఒక అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించారట. సరీం పెద్ద కొడుకు కి సరీం అలా ఎడ్వర్టైజ్మెంట్ లో కనిపించడం అంత పెద్దగా నచ్చదట, కానీ చిన్న కొడుకు మాత్రం తమ తండ్రి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం చూసి ఆనందిస్తాడట.

అలా తన ఎక్స్ప్రెషన్ వైరల్ అవ్వడం చూస్తే ఆనందంగా ఉందని, తన మీద రూపొందించిన మీమ్స్ చూసి తను కూడా నవ్వుకుంటాను అని, అంతేగాని ఆ గుర్తింపు మాత్రం నెత్తికి ఎక్కించుకోను అని, అంతేకాకుండా అలా వచ్చిన గుర్తింపు వల్ల పొగరు,గర్వం లాంటివి రావడం కూడా మంచిది కాదు అని అన్నారు సరీం.

 


End of Article

You may also like