కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.! కానీ అంతలోపే.? కంటతడి పెట్టిస్తున్న సంఘటన.!

కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.! కానీ అంతలోపే.? కంటతడి పెట్టిస్తున్న సంఘటన.!

by Mohana Priya

Ads

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను కూడా ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అంతలోపే అనుకోని సంఘటన ఇరు కుటుంబాలలో విషాదం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే, సుమన్ టీవీ కథనం ప్రకారం నెల్లూరు జిల్లా, ఉండ్రాళ్ళ మండలం, గ్రామనత్తంకి చెందిన సౌమ్య, శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. ఇదే మాటని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ వారి కుటుంబాలు వారి పెళ్ళికి ఒప్పుకోలేదు.nellore incident

Video Advertisement

కానీ చివరికి వారు వీళ్ళ ప్రేమని అర్థం చేసుకొని సౌమ్య, శ్రీకాంత్ పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే, శ్రీకాంత్ కి ఒక అన్నయ్య ఉన్నారు. అన్న పెళ్లి జరిగిన తర్వాత తన పెళ్లి చేస్తాము అని కుటుంబ సభ్యులు చెప్పారు. వీరిద్దరూ కూడా దానికి సరే అన్నారు. శ్రీకాంత్ పెళ్లిళ్ళ కి, ఫంక్షన్స్ కి ఎలక్ట్రికల్ డెకరేషన్ చేస్తుంటారు. ఆత్మకూరులో ఇలా ఒక డెకరేషన్ పని కోసం వెళ్లిన శ్రీకాంత్ ఎలక్ట్రికల్ షాక్ వల్ల మరణించారు.

ఈ విషయాన్ని సౌమ్య జీర్ణించుకోలేకపోయారు. దాంతో సౌమ్య కూడా తన ఇంట్లో ఉన్న పంటలకు వాడే మందు తాగేశారు. ఇది గ్రహించిన తన కుటుంబ సభ్యులు సౌమ్యని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే సౌమ్య మరణించారు అని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనతో
ఇరు కుటుంబాలలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్, సౌమ్య కి వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.


End of Article

You may also like