విషాదం…అనుమానాస్పదస్థితిలో తెలుగు టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి మృతి..!

విషాదం…అనుమానాస్పదస్థితిలో తెలుగు టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి మృతి..!

by Sainath Gopi

Ads

టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు.గత నాలుగు రోజులుగా శాంతి తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Video Advertisement

ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శాంతి ఎలా చనిపోయిందనే దానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. ఆ ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. కాగా శాంతి మూడేళ్లుగా తమ అపార్ట్‌మెంటులో నివాసముంటోందని అపార్ట్‌మెంటు వాసులు చెబుతున్నారు.వైజాగ్‌కు చెందిన శాంతి పలు సీరియల్స్‌లో నటించారు.


End of Article

You may also like