కరోనా దెబ్బ ప్రస్తుతం అందరూ మాస్క్ లు ధరించడం తప్పనిసరి అయ్యింది.దీనితో బయటకు వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారో ఎవరు వెళ్తున్నారో అసలు తెలియట్లేదు.మాస్క్ లు ధరించడం ద్వారా ఊపిరి ఆడట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందులు తట్టుకోలేక ఉన్నాం త్వరగా ఈ మహమ్మారి దేశాన్ని వదిలితే బాగుండని ప్రజలంతా భావిస్తున్నారు.ఇలాంటి టైంలో కరోనా పూర్తయ్యాక కూడా జనాలు మాస్క్ లు ఆరు నెలలు ధరించడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఇక కరోనాతో సహజీవనం తప్పదంటూ వాణిజ్య కార్యకలాపాలను మొదలుపెట్టడానికి అన్నీ సెక్టార్స్ లో మినహాయింపులు ఇచ్చింది.అందులో భాగంగా షూటింగ్స్ కు పర్మిషన్స్ లభించాయి.దానితో కరోనా ఎటు నుండి వస్తుందో అని లోపల భయపడుతున్న తమ ఆర్థిక అవసరాల కోసం అందరూ షూటింగ్స్ కు వస్తున్నారు.

మరి ఆర్టిస్టుల భయం వల్ల కావచ్చు లేదా ప్రజలను నవ్వించడానికి కావచ్చు ప్రస్తుతం సీరియల్స్ కూడా నటి నటులు మాస్క్ లు వేసుకుంటున్నారు.అవునండీ బాబు మీరు విన్నది నిజమే హిందీ సూపర్ హిట్ సీరియల్ ‘Yeh Rishta Kya Kehlata Hai’ లో మాస్క్ లు నటుల మొహాలకు మాస్క్ లు వేసుకొని కనపడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.దీనితో మన నెటిజన్స్ ఆ వీడియోకు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ నవ్వులు పువ్వులు పోయిస్తున్నారు.అవి నేను చెప్పడం కన్నా మీరు చూడడం బెటర్ గా ఉంటుంది. ఓ సారి అవేంటో లుక్ వేయండి.
https://twitter.com/i/status/1282822392792915970
