“ఈ 5 సంవత్సరాలు చాలా పోరాడాం…కానీ.?” అంటూ… వైరల్ అవుతున్న దీప్తి సునైనా పోస్ట్..!

“ఈ 5 సంవత్సరాలు చాలా పోరాడాం…కానీ.?” అంటూ… వైరల్ అవుతున్న దీప్తి సునైనా పోస్ట్..!

by Megha Varna

Ads

గత కొన్ని రోజుల నుంచి కూడా దీప్తి సునైనా, షణ్ముఖ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా తనని బ్లాక్ చేసింది అని కూడా చెప్పాడు. అయితే తాజాగా దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది.

Video Advertisement

అది ఇప్పుడు వైరల్ అవుతోంది. “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని దీప్తి ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. “షణ్ముఖ్ మరియు నేను ఆలోచించి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోవాలని అనుకుంటున్నాం” అని అంది.

“అయితే ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఉన్నాము. కానీ మా దారులు వేరు అని మేము తెలుసుకున్నాం” అని దీప్తి అంది. “అందుకే మేము విడిపోతున్నాం” అంటూ సోషల్ మీడియా ద్వారా దీప్తి సునైనా పోస్ట్ చేసింది. అలానే ఈ సమయం చాలా క్లిష్టమైనది అని పైగా తన ప్రైవసీకి ఎటువంటి భంగం కలిగించవద్దని దీప్తి సునయన కోరింది. అయితే వీళ్ళ బ్రేకప్ కి కారణం సిరితో షన్ను ప్రవర్తించిన తీరే అని తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే, షన్ను, “తనకి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది” అని అన్నాడు. అలానే ఇప్పటి వరకు ఆమె చాలా చేసిందని, ఇప్పుడు ఆమె ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. “అయితే ఎలాంటి దారిలో మేము వెళ్ళినా సరే ఒకరికొకరు సపోర్టుగా ఉంటాం” అని చెప్పాడు షన్ను. అయిదేళ్ల పాటు మంచి వ్యక్తిగా ఎదగడానికి దీప్తి సపోర్ట్ ఇచ్చిందని, ఆమె ఆనందమే కోరుకుంటున్నానని సోషల్ మీడియా లో షణ్ముఖ్ పోస్ట్ చేశాడు.


End of Article

You may also like