• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

ఆ గాయం ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉంది…సింగర్ చిత్ర ఎమోషనల్ పోస్ట్..!

Published on April 22, 2020 by Sainath Gopi

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, ఇలా భాష ఏదైనా తన గానంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి గాయకురాలు కే.ఎస్ చిత్ర గురించి తెలియనివారుండరు. ఈమె ఇప్పటివరకు దేశంలోని ప్రముఖ భాషల్లో దాదాపుగా 25 వేలకి పై చిలుకు పాటలను పాడింది. ప్రస్తుత జనరేషన్ లో వెస్టర్న్ మ్యూజిక్ అంటూ ఎన్నో పాటలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలామంది సింగర్ చిత్ర మధురమైన పాటలకి అభిమానులున్నారు. అంతేగాక సంగీత ప్రియుల తమ అభిమాన సింగర్స్ లిస్ట్ లో కూడా కె.ఎస్.చిత్ర కొనసాగుతుంటారు. అంతలా తన గానంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ గాన కోకిల.

అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతుంటాయి. అంతేగాక ఆ సంఘటనలు తీరని, మాయని గాయాలను కూడా చేస్తూ ఉంటాయి. చిత్ర జీవితంలో కూడా ఓ విషాద సంఘటన 2011 సంవత్సరంలో చోటు చేసుకుంది. అప్పట్లో ఓ ఈవెంట్ లో పాటలు పాడడం కోసం చిత్ర తన ఒక్కగానొక్క కూతురు నందనను తన వెంటబెట్టుకుని వేరే దేశానికి వెళ్ళింది. అయితే అనుకోకౌండా తాను బస చేసే టువంటి హోటల్ లో ప్రమాదవశాత్తు నందన స్విమ్మింగ్ పూల్ లో పడి మరణించింది.

ఈ సంఘటనతో చిత్ర కొంతకాలం పాటు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ సంఘటన జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటికే నందనని తలుచుకుని చిత్ర బాధపడని రోజు లేదు. ఇటీవలే చిత్ర ఒక్కగానొక్క కూతురు వర్ధంతి కావడంతో ఆమె తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇందులో “ఈ భూమి మీద ప్రతి ఒక్కరి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుందని అందరూ అంటుంటారు. అంతేగాక ఆ కారణం పూర్తయిన తర్వాత ఆత్మ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అలాగే కాలానికి కూడా ఎంతటి గాయం అయినా మాన్పించే శక్తి ఉందని అంటారు కానీ తన కూతురి మరణం చేసిన గాయం ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉందని మిస్ యు నందన అంటూ ఎమోషనల్ అయ్యారు.

దీంతో పలువురు నెటిజన్లు నందన ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించారు. అంతేగాక ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొందరు ముఖ్యమైన మనుషులు ఉంటారని వారు దూరమైన సమయంలో ఆ బాధ వర్ణనాతీతమని అలాగని ఆ బాదనే తలుచుకుని కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లలేమని కాబట్టి మన నుంచి దూరంగా వెళ్ళి పోయిన వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదని చిత్రకి ధైర్యం చెబుతున్నారు.


We are hiring Content Writers. Click Here to Apply



About Sainath Gopi

A Mechanical Engineer turned into an Author. Have 6 years of work experience by working as Web Content Manager for various top telugu websites. Expertise in writing Human angle stories, Unknown Facts and excusive film-based content. Enthusiastic in Lyric and Story Writing.

Search

Recent Posts

  • RCB కప్ గెలిచినా కోహ్లికి కష్టమే అనుకుంటా.? ఈ యాంగిల్ లో ఒక్కసారి చూడండి.!
  • ఆ హీరోయిన్ ను రష్మిక మాజీ ప్రియుడు పెళ్లి చేసుకోబోతున్నారా..? షాక్ లో ఉన్న స్టార్ హీరోయిన్..!
  • “ఇక్కడ వదిలేస్తే నేను బతకలేను.. భయమేస్తోంది నాన్న..” వైరల్ అవుతున్న విస్మయ ఆడియో క్లిప్.. అసలేం జరిగిందంటే?
  • “మురళి విజయ్”తో ఎఫైర్ పెట్టుకొని భర్తకు విడాకులు… “దినేష్ కార్తీక్” గురించి ఇది తెలిస్తే రియల్ హీరో అంటారు.!
  • “NTR 31” పోస్టర్ లో ఇది గమనించారా..? అంటే ఎన్టీఆర్ వాళ్లద్దరికీ పుట్టబోయే కొడుకు అవుతాడా..?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions