సింగర్స్ అంత మంచిగా పాడుతుంటే…మధ్యలో ఆ అరుపులు చిల్లర వేషాలు ఏంటి.?

సింగర్స్ అంత మంచిగా పాడుతుంటే…మధ్యలో ఆ అరుపులు చిల్లర వేషాలు ఏంటి.?

by Megha Varna

Ads

మన టీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ ఎంత వస్తుందో, నెగటివ్ రెస్పాన్స్ కూడా అంతే వస్తుంది. అందులోనూ ముఖ్యంగా షోస్ కి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. ఆ పర్టికులర్ షోకి క్రేజ్ రావడానికి ఎక్కువ కారణం నెగిటివ్ ట్రోలింగ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇలా ట్రోలింగ్ వల్ల పాపులరైన షోస్ చాలానే ఉన్నాయి.

Video Advertisement

అలా కొన్ని షోస్ కి నెగిటివ్ రెస్పాన్స్ రావడానికి ముఖ్య కారణం అందులో వాళ్ళు అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం చేసే పనులు, లేదా ఓవర్ ద టాప్ పెర్ఫార్మెన్సెస్. కొన్ని నెలల క్రితం ఈ టీవీ లో ప్రారంభమైన ప్రోగ్రాం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ ప్రోగ్రాం ప్రతి ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. ఇందులో ఎంతో మంది వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శిస్తారు.

అందులో మనకి తెలిసిన వాళ్ళు కొంత మంది ఉంటారు. తెలియని వాళ్ళు కొంత మంది ఉంటారు. ఏదేమైనా టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందు ఉంటారు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కి కూడా వ్యూస్ బానే ఉంటాయి. అయితే ఈ ప్రోగ్రాం లో ఇటీవల జరిగిన ఒక సంఘటన మాత్రం చాలా మందికి కోపం కలిగించే విధంగా ఉంది.

ఇటీవల ఎపిసోడ్ లో సింగర్స్  దామిని, సత్య యామిని, శృతి కలిసి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ సింగర్స్ ముగ్గురు పాడుతున్న అంతసేపు ఆ షోలో ఉండే వేరే వాళ్ళు స్టేజ్ మీదకి రావడం, డాన్స్ చేయడం, అంతే కాకుండా  సత్య యామిని పాడుతున్నప్పుడు మధ్యలో వెళ్లి డిస్టర్బ్ చేయడం అనేది ప్రేక్షకులకు చాలా ఇబ్బందిగా అనిపించింది.

సాధారణంగా ఎవరైనా ఒక స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయరు. అది మామూలుగా అందరూ పాటించే విషయం. ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే ఆడియన్స్ లో కూర్చొని అరవడం, చీర్ చేయడం వంటివి చేస్తారు.

అంతే కానీ స్టేజ్ మీదకు వెళ్లి పర్ఫార్మ్ చేస్తున్న వాళ్ల దగ్గరికి అయితే వెళ్లరు.  అయితే ఈ వీడియోని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కింద అందరూ “వాళ్లు పాడుతుంటే విననివ్వకుండా డిస్టర్బెన్స్ ఏంటి?” అని కామెంట్స్ పెడుతున్నారు.

 

watch video :


End of Article

You may also like