తిరుమలలో అల్లు స్నేహరెడ్డి…స్వామివారిని దర్శించుకున్న బన్నీ భార్య.!

తిరుమలలో అల్లు స్నేహరెడ్డి…స్వామివారిని దర్శించుకున్న బన్నీ భార్య.!

by Mounika Singaluri

Ads

ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎంత ఫేమస్సో ఆయన భార్యగా అల్లు స్నేహారెడ్డి కూడా అంతే ఫేమస్. ఈమె తన భర్తతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే మెగా ఫ్యామిలీ లో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె తప్పక హాజరవుతుంది. ఏ హీరోయిన్లకి తీసిపోని అందంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడుతుంది.

Video Advertisement

అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ కుటుంబానికి సంబంధించిన విషయాలని, కొడుకు కూతురుకి సంబంధించిన విషయాలని, వాళ్ళ క్యూట్ ఫొటోస్ ని ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. రీసెంట్ గా స్నేహ మై పేరేంటింగ్ మంత్ర అంటూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఒక ప్రణాళికని ఏర్పరుచుకోవాలని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పిల్లల్ని కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించేలాగా ప్రోత్సహించాలి. అన్నింటికంటే ముఖ్యమైనది తల్లులు తమ కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలి అంటూ అల్లు అర్హ చెప్పిన పేరెంటింగ్ టిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా స్నేహ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్నేహ వెంట బన్నీ, పిల్లలు కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో స్నేహ రెడ్డికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.


End of Article

You may also like