మహేష్ బాబు కోసం ముగ్గురు హీరోయిన్స్.. గురూజీ స్కెచ్.. మామూలుగా లేదుగా!

మహేష్ బాబు కోసం ముగ్గురు హీరోయిన్స్.. గురూజీ స్కెచ్.. మామూలుగా లేదుగా!

by kavitha

Ads

Mahesh Babu: సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి SSMB 28 వ‌ర్కింగ్ టైటిల్‌. ఈ చిత్రం కొన్ని రోజుల ముందే మొదటి షెడ్యూల్ షూటింగ్ ను పూర్తిచేశారు. సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేలోపే మ‌హేష్ బాబు తండ్రి, సూప‌ర్‌స్టార్ కృష్ణ మరణించారు. దాంతో సెకండ్ షెడ్యూల్ ఆలస్యం అయ్యి, డిసెంబ‌ర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని తెలుస్తోంది.

Video Advertisement

తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, త్రివిక్ర‌మ్ తీసే సినిమాలలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. మ‌హేష్ తో తీసే ఈ మూవీలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్, శ్రీలీల రెండో హీరోయిన్‌గా న‌టించ‌నుందని లేటెస్ట్ సమాచారం. అయితే శ్రీలీలతో సంప్ర‌దింపులు కూడా అయ్యాయని తెలుస్తోంది. ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన మాటర్ ఏంటంటే త్రివిక్ర‌మ్ ఈ సినిమా కోసం ఐటెమ్ సాంగ్‌ను కూడా ప్లాన్ చేశార‌ని సమాచారం. మ‌హేష్‌తో ఓ స్టార్ హీరోయిన్ ఈ సాంగ్‌లో నటించనుందని తెలుస్తోంది. కానీ స్టార్ హీరోయిన్ ఎవ‌రు అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

mahesh-babu-1-telugu-adda

SSMB 28 సినిమాలో గురూజీ ముగ్గురు హీరోయిన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఒక సీనియర్ హీరోయిన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తుందని చెప్తున్నారు. మహేష్ హ్యండ్ సమ్ హీరో, దానికి తగ్గట్లుగా త్రివిక్రమ్ ఈ సినిమాలో మరింత గ్లామర్ ను అద్దుతున్నారని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. మహేష్ ఈ సినిమా కోసం పూర్తిగా తన లుక్‌ని మార్చుకుని,. సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై ఈ మూవీని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 3వ సినిమా. ఇంతకు ముందు అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు.


End of Article

You may also like