Ads
సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి. సమంత గత కొంత కాలం నుండి టూర్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్క రోజు కోసం హైదరాబాద్ కి వచ్చారు.
Video Advertisement
సమంత, నాగ చైతన్య విడాకుల వరకు వెళ్లారు అని, ఆ కౌన్సిలింగ్ కోసమే సమంత హైదరాబాద్ కి వచ్చారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది. అయితే వీరిద్దరి విడాకులకి సంబంధించిన కౌన్సిలింగ్ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున వీరిద్దరిని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా ఫలితం లేదు అని సమాచారం. దాంతో ఇద్దరూ మ్యూచువల్ గా విడాకులు తీసుకోబోతున్నారట. విడాకుల తర్వాత సమంత ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన బాలీవుడ్ కెరియర్ పై సమంత ఫోకస్ పెట్టనున్నారట.
ఈ విషయంపై శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాశారు. “వారిద్దరిపై ఇలాంటి పుకార్లను పుట్టించకండి. చై సామ్ బెస్ట్ కపుల్స్ లో ఒకరు. వాళ్లు చాలా క్యూట్, స్వీట్” అని శ్రీ రెడ్డి రాశారు. అంతే కాకుండా నాగ చైతన్య, సమంత పెళ్లి వీడియోని కూడా యాడ్ చేశారు. ఏది ఏమైనా కానీ ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ అసలు స్పందించకపోవడం వల్ల చర్చలు ఇంకా పెరుగుతున్నాయి.
https://twitter.com/MsSriReddy/status/1437646480655802370
End of Article