Ads
హీరో హీరోయిన్లు సమయం దొరికినప్పుడు అభిమానులతో చాటింగ్ చేస్తూనే ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటారు. వాళ్లు రీసెంట్ గా తీసుకున్న ఫోటోలు షేర్ చేయడం లేదా చైల్డ్ హుడ్ ఫొటోస్ ని షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయిన శృతి హాసన్ కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
Video Advertisement
ఎక్కువగా అభిమానులతో ఆమె చాటింగ్ చేస్తూ ఉంతుంది. అలానే వాళ్ళు అడిగే ప్రశ్నలకి కూడా ఆమె సమాధానం చెబుతూ ఉంటారు. అయితే ఎన్నో సినిమాల్లో నటించిన ఈ స్టార్ హీరోయిన్ తాజాగా అభిమానులతో సందడి చేసింది. గత కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ శాంతను హజరికా తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తన ప్రియుడితో దిగిన ఫోటోలు చాలా సార్లు ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
తాజాగా ఈమె సోషల్ మీడియాలో క్విజ్ లో పాల్గొన్నారు. ఇంస్టాగ్రామ్ లో వాటికి ఆమె ఆన్సర్స్ కూడా చెప్పారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. ఆమె మొదట ఐ లవ్ యు అని చెప్పారట. వీళ్ళిద్దరూ గత రెండు సంవత్సరాల నుండి కూడా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు అన్న ప్రశ్న కి శృతిహసన్ నేనే అని సమాధానం చెప్పింది. ఎవరు బాగా తింటారు అంటే తన బాయ్ ఫ్రెండ్ అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CYf6LQ7hAKL/
End of Article