ఈసారి ”SSMB29” కి రాజమౌళి మాస్టర్ ప్లాన్..? ఏకంగా వారితో ఏ ఫైట్..?

ఈసారి ”SSMB29” కి రాజమౌళి మాస్టర్ ప్లాన్..? ఏకంగా వారితో ఏ ఫైట్..?

by Megha Varna

Ads

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Video Advertisement

ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. హారిక హాసిని బ్యానర్ మీద భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.

dhoni producing fims with south stars like mahesh and vijay..!!

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నారు. వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. యాక్షన్ అడ్వెంచర్ అయిన ఈ చిత్రం లో మహేష్ ప్రపంచం లోని చాలా ప్రాంతాలు తిరుగుతారు కాబట్టి వివిధ దేశాలకు చెందిన నటులు ఇందులో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చాలా జంతువులతో కూడిన సన్నివేశాలు ఉంటాయి. నీటి లోపల అత్యంత అద్భుతమైన సన్నివేశాలను రూపొందించడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది.

rajamouli-mahesh babu movie updates

పైగా ఈ జోనర్ లో వచ్చే మొదటి భారతీయ చిత్రం. ఈ సినిమాలో మహేశ్ జోడిగా శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు అలియా భట్, దీపికా పదుకొనె పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. దీపికా కు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి ఆమె వైపే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కోసం ఒక అప్డేట్ వచ్చింది. అదేమిటో చూస్తే.. నరమాంసం తినే ఆఫ్రికన్ తెగ ని ఈ చిత్రం లో చూపించనున్నట్టు తెలుస్తోంది. వాళ్ళతో మహేష్ ఫైట్ చేస్తారట.


End of Article

You may also like