ఆ తర్వాత ఏ స్టార్ హీరో కూడా సరైన హిట్ అందుకోలేకపోయాడు…!

ఆ తర్వాత ఏ స్టార్ హీరో కూడా సరైన హిట్ అందుకోలేకపోయాడు…!

by Mounika Singaluri

Ads

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కదిపేసిందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ప్రజలతోపాటు అన్ని వర్గాల వారు, అన్ని ఇండస్ట్రీలు కూడా నష్టం చూసాయి. ఈ కరోనా ప్రభావం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడింది. కరుణ కరణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది బతుకులు మారిపోయాయి. ఈ ప్రభావం స్టార్ హీరోల సినిమాల మీద కూడా పడింది. కరుణ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో సినిమా కూడా సరైన బ్రేక్ ఈవెన్ సాధించలేదు. హిట్ అయినప్పటికీ కొన్ని ఏరియాలో నష్టాలు మిగిల్చాయి.

Video Advertisement

కరోనా తర్వాత బాహుబలి ప్రభాస్ నటించిన ఆది పురుష్, రాధే శ్యామ్ సినిమాలు నష్టాలు మిగిల్చినప్పటికీ తాజాగా వచ్చిన సలార్ సినిమా కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా యావరేజ్ టాక్ పొంది కొన్ని చోట్ల బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు పొందిన కూడా ఆంధ్ర ఏరియాలో కొన్నిచోట్ల నష్టాలు వచ్చాయి.

ఇక దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రామ్ చరణ్-ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచినప్పటికీ ఈ సినిమా కొన్నిచోట్ల అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సాధించలేదు. మొత్తం మీద కరోనా ప్రభావం స్టార్ హీరోలను సైతం వదిలిపెట్టలేదని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.


End of Article

You may also like