కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన టీచర్ తో టిఫిన్ సెంటర్ పెట్టించిన స్టూడెంట్స్.!

కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన టీచర్ తో టిఫిన్ సెంటర్ పెట్టించిన స్టూడెంట్స్.!

by Megha Varna

Ads

సాధారణంగా విద్యార్థులు తమ గురువులకు ఫీజ్ ఇవ్వడం,వెనకాల వాళ్ళ పైన సెటైర్ లు వేయడం చేస్తుంటారు. కాని కొందరు విద్యార్థులు కష్టాలలో ఉన్న వాళ్ళ గురువుకు గురదక్షిణ ఇచ్చారు.అది చూసినవారంతా షాక్ అవుతున్నారు.అదేంటో మీరు కూడా ఓ లుక్ వేయండి.

Video Advertisement

రుద్రంగి జిల్లాప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఆంగ్ల‌ము, జీవ‌శాస్త్రం పాఠాలు నేర్పే 52 ఏళ్ల హ‌నుమంతుల రఘు కరోనా కారణంగా ఆయన టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయారు. కొడుకు కూడా నిరుద్యోగి కావడంతో ఆ కుటుంబం పూర్తి ఆర్థిక కష్టాలలో కూరుకుపోయింది.గురువు కష్టాలలో ఉన్నారని విషయం తెలుసుకున్న శిష్యులు అక్కడ ఉన్న స్థలంలో గురువుకు టిఫిన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు..ఆ షాప్ వద్దకు కస్టమర్స్ ను కూడా తీసుకొస్తానని తన శిష్యులు చెప్పారని ఆ గురువు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తన శిష్యులు ఇచ్చిన ఆ టిఫిన్ సెంటర్ కు ఆ గురువు గురుదక్షిణ అని పేరు పెట్టారు.ఈ గురు,శిష్యుల బంధాన్ని చూసిన వారంతా వీరి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


End of Article

You may also like