సుహాస్ కొత్త సినిమా దర్శకుడు సలార్ సినిమాకి పనిచేశాడా?

సుహాస్ కొత్త సినిమా దర్శకుడు సలార్ సినిమాకి పనిచేశాడా?

by Mounika Singaluri

Ads

చాయ్ బిస్కెట్ చానల్లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు నటుడు సుహాస్. ఒకపక్క హీరోగా చేస్తూనే మరోపక్క మంచి మంచి క్యారెక్టర్లు వస్తే తన ప్రతిభ చాటుకుంటున్నాడు. ఈ సంవత్సరం రైటర్ పద్మ భూషణ్ సినిమాతో మంచి హిట్ దక్కించుకున్నాడు.

Video Advertisement

ఇవికాక సుహాసులైనప్పుడు ఐదు ఆరు సినిమాలు ఉన్నాయి.అవి అన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే తాజాగా దిల్ రాజు బ్యానర్లో సుహాస్ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది ఈ సినిమా ఓపెనింగ్ కి కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన ఈ కార్యక్రమానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీని వెనక అసలు విషయం ఏంటంటే…సుహాస్ సినిమాని సందీప్ బండ్ల డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన సలార్ సినిమాకి డైలాగ్ రైటర్ గా పని చేశారని తెలుస్తుంది. మరి ఈ వార్త నిజామా అనేది తెలియదు. ఆ కారణం చేతనే ప్రశాంత నీల్ హాజరయ్యారని అంటున్నారు.


End of Article

You may also like