మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటే కొన్ని సంకేతాలు కనబడుతూ ఉంటాయి.. ఇవి కనబడితే దరిద్రం రాబోతుందని అర్థం. అవేంటో తెలుసుకుందాం..!
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు ఎందుకు జరుగుతాయో కూడా అర్థం ఉండదు. ఇంట్లో ఉండే వస్తువులు పాడై పోతుంటాయి.

అనుకోకుండా కిందపడిపోయి పగిలిపోతూ ఉంటాయి. ముఖ్యంగా గాజు వస్తువులు పగిలిపోవడం. అలాగే ఎవరో తెలియని వ్యక్తి కూడా మన దగ్గరికి వచ్చి అడ్రస్ అడిగిన వారి గురించి కూడా మనం పోట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం కారణం ఏంటో కూడా ఆలోచించే విధానం కనిపించదు.

మనం ఏ పని చేయాలని మొదలు పెట్టినా అది మధ్యలోనే ఆగిపోయింది. ఎటైనా ప్రయాణం చేద్దాం అనుకుంటాం. అంతలోనే ఏదో ఒకటి జరిగి అది క్యాన్సల్ అయిపోతుంది. ముఖాలలో కల తప్పిపోయి వాలిపోయి ఉండటం లాంటివి జరుగుతుంటాయి. ఈ సంకేతాలు కనిపిస్తే మనకు దారిద్రం పట్టబోతుంది అని అర్థం.

దీని నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. పాత వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. దానం చేయాలి. ఇంట్లో ఆకుపచ్చని మొక్కలు పెంచాలి. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ విధమైన రెమిడీస్ పాటిస్తే దరిద్రం దరిదాపుల్లో కూడా ఉండకుండా పోతుందనీ ఆధ్యాత్మిక నిపుణులు తెలుపుతున్నారు.


ముఖ్యంగా గుమ్మానికి గుమ్మడికాయను కట్టేది నరదృష్టి, నరఘోష మన ఇంటి పై పడకుండా ఉండటం కోసం ఈ బూడిద గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి కడతారు. ఇందులో ముఖ్యంగా బూడిదగుమ్మడి కాయలు మాత్రమే గుమ్మానికి కట్టాలి. మరోరకం గుమ్మడికాయను మాత్రం శుభ కార్యక్రమాల్లో పగలకొడతారు. అలాగే దాన్ని సాంబార్ లో కూడా ఉపయోగిస్తారు.
ఆ విధంగా మెయిన్ గుమ్మాలకు కట్టాలి. ఇలా ముందు కట్టడంవల్ల మన ఇంట్లోకి వచ్చే వారి చూపు ముందు గుమ్మడికాయ మీద పడుతుంది. దీనివల్ల వారి చెడు దృష్టి అనేది ఆ కాయ లాక్కుంటుంది. ఇందులో కొంత మంది కట్టిన వారం, పది రోజులకే గుమ్మడికాయ పాడవుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే నరదృష్టి ఎక్కువగా ఉంటే మాత్రమే గుమ్మడికాయ త్వరగా పాడవుతుంది. అలా గుమ్మడికాయ పాడైన వెంటనే దాన్ని తీసివేసి కొత్తది కట్టేయాలి.