ఆచార్య చాణిక్యుడు ఎన్నో ఆర్థిక పరమైన మరియు కుటుంబపరమైన రాజకీయపరమైన ఇంకా అనేక మైనటువంటి మంచి విషయాలు రచించిన గొప్ప నీతి యోగి చాణక్య.. ఆయన తెలియజేసిన నీతులు మనిషి జీవితంలో ఏ విధమైన అలవాటు ఉంటే విజయవంతంగా సంతోషకరంగా జీవితాన్ని గడుపుతారో చెబుతోంది.
అలాగే మనిషి సన్మార్గంలో ధనవంతుడు కావాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతోంది. అలాగే సంపాదించిన డబ్బులు కాపాడుకోవడానికి ఏ విధంగా మనం వ్యవహరించాలో చాణక్యనీతి చెబుతుంది. ఆయన తెలిపిన కొన్ని విషయాలు మన జీవితంలో అమలు చేస్తే అసలు సమస్యలనేవి రావు. మనిషి ధనవంతులు కావాలంటే చాణిక్యుడు కొన్నింటిని తెలియజేసాడు అది ఏంటో తెలుసుకుందాం..!!
కొంతమంది ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది అంటారు. అలాంటి వ్యక్తులు వారు ఆచరించే వ్యవహారాలను బట్టి గౌరవం దక్కుతుంది. ఇటువంటి వారు మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుంది. దీని అర్థం మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారని. ఆచార్య చాణిక్యుడు చెప్పిన వివరాల ప్రకారం ఇతరుల విషయంలో మంచి భావనతో మెలగాలి.
చేతనైన సహాయం ఇతరులకు అందించాలి. అలాగే ఇతరుల కష్టాల్లో కూడా పాలు పంచుకోవాలి. అలాంటివారికి డబ్బులకు ఎలాంటి కొరత ఉండదని చాణిక్యుడు చెప్పారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో గౌరవం తో పాటుగా వారు ఏ పనులు చేసినా కలిసి వచ్చి వారి వ్యాపారాలు కానీ వారి సంపద కానీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని చాణిక్యుడు తెలియజేశాడు.