OTTలో రాబోతున్న ‘ది కేరళ స్టోరీ’..! ఎప్పటి నుండి అంటే..

OTTలో రాబోతున్న ‘ది కేరళ స్టోరీ’..! ఎప్పటి నుండి అంటే..

by kavitha

Ads

చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ. ఎన్నో వివాదాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యింది. రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Video Advertisement

కొన్ని రాష్ట్రాలలో ఈ సినిమాని నిషేధించినప్పటికీ, మిగతా రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ థియేటర్ల లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ది కేరళ స్టోరీ చిత్రంఇప్పటివరకు సుమారు 200 వందల కోట్లకు పైగా వసూల్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం, ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది.
‘ది కేరళ స్టోరీ’ సినిమా ఇప్పటికి థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ, బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే తాజాగా అందుటున్న సమాచారం మేరకు ఈ మూవీ జూన్ 23 నుండి జీ5 ఓటీటీలో ప్రసారం అవనున్నట్లు తెలుస్తోంది. జీ5లో ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీలో కూడా స్ట్రీమింగ్ అవనుంది.ఈ చిత్రానికి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ అదా శర్మ ఈ మూవీలో లీడ్ రోల్ లో  నటించింది. సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. మే 5న వివాదాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కేరళ రాష్ట్రంలో అమాయకులైన యువతులను లవ్ జిహాద్ పేరిట మతమార్పిడి చేసి, ఆ యువతులను ఐఎస్ఐఎస్ క్యాంపుల్లోకి పంపించి టెర్రరిస్టులుగా మారుస్తున్నారనే స్టోరీతో ఈ చిత్రాన్ని  రూపొందించారు.
దాంతో ఈ చిత్రానికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఈ చిత్రం పై కొన్ని రాష్ట్రాలలో బ్యాన్ విధించగా, ఈ చిత్రం పై ఎంతోమంది కేసులు కూడా పెట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైన చివరికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. అదా శర్మ ఎన్నో చిత్రాలలో నటించినా రాని గుర్తింపు ఈ చిత్రంతో సంపాదించింది.

Also Read: “మహేష్ బాబు” కి, “జూనియర్ ఎన్టీఆర్” కి… ఈ 4 విషయాలు ఒకే లాగా జరిగాయా..?


End of Article

You may also like