రియల్ TO రీల్..! “ది కేరళ స్టోరీ” లోని 4 మహిళలు ఎవరో తెలుసా..?

రియల్ TO రీల్..! “ది కేరళ స్టోరీ” లోని 4 మహిళలు ఎవరో తెలుసా..?

by kavitha

Ads

భారతీయ సినిమా పరిశ్రమలో ‘ది కేరళ స్టోరీ’ ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. ఈమూవీ రిలీజ్ కాకముందే జనాల్ని 2 వర్గాలుగా విడదీసిందని చెప్పవచ్చు. ఇటు రాజకీయ నాయకులు, అటు సామాన్యులు కూడా ఈ మూవీ గురించిన చర్చించడం మొదలుపెట్టారు.

Video Advertisement

విమర్శలు, వివాదాల మధ్య ఈ సినిమాను మే 5 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. కేరళ నేపథ్యంలో సాగే ఈ చిత్రం  యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని చెప్పడంతో వివాదం మొదలైంది. ది కేరళ స్టోరీ చిత్రంలో చెప్పిన ఆ వాస్తవ ఘటనలు, మరియు ఆ నలుగురు అమ్మాయిలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఈ మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. కేరళ ముఖ్యమంత్రితో సహా రాజకీయ నాయకులు ఈ చిత్రం పై తీవ్రంగా మండిపడ్డారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ వెంటనే ఈ మూవీని విడుదల చేయకూడదని కేరళ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కేరళ, తమిళనాడుల్లో ఈ మూవీని రిలీజ్ ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఆందోళనలు, వివాదాలు, విమర్శలు, నిరసనల మధ్యనే ఈ చిత్రం విడుదలైంది.
ఈ మూవీ కథ లోకి వెళ్తే కేరళలోని కాసర్గాడ్‌లోని నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ చేరుతుంది. అక్కడ నిమా, గీతాంజలి పరిచయం అవుతారు. హాస్టల్‌లో అసీఫాతో కలిసి రూమ్ షేర్ చేసుకొంటారు. అసీఫా ఐసీస్ లో అండర్ కవర్‌గా పనిచేస్తూ, అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి  మారుస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు అసీఫా మాటలకు ఆకర్షితులై ఇస్లాం మతంలోకి మారుతారు.
మతం మార్చబడిన ఈ అమ్మాయిలు ఇస్లామిక్ స్టేట్‌లోకి రిక్రూట్ అయ్యారు. వీరిని ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ మరియు సిరియాలకు ఇస్లాం మతం కోసం పోరాడటానికి పంపిస్తారు. నిజం తెలుసుకున్న తరువాత వారు ఏం చేశారు అనేదే ఈ చిత్రం. ఇక ‘ది కేరళ స్టోరీ’లోని అదా శర్మ పోషించిన ‘షాలినీ ఉన్నికృష్ణన్’ అనే పాత్ర కేరళ నలుగురు మహిళల్లో ఒకరైన నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈమె 2016 -2018 కాలంలో ఐసీస్ లో చేరి, ఆ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు పారిపోయారు.
ఐసీస్ నియంత్రణలో ఉన్న ఖొరాసన్ ప్రావిన్స్‌లో US దళాలు నిమిషా అలియాస్ ఫాతిమాతో పాటు పారిపోయిన మరో ముగ్గురిని సోనియా సెబాస్టియన్ అలియాస్ ఆయిషా, మెర్రిన్ జాకబ్ అలియాస్ మరియం మరియు రఫెలాగా గుర్తించారు. నిమిషా భర్త ఐసిస్ ఉగ్రవాద దాడిలో చనిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ జైలులో ఉన్నారు. ఆమె అసలు పేరు నిమిషా సంపత్. హిందువు తరువాత ఇస్లాంలోకి మారింది. అలాగే తన పేరును కూడా ఫాతిమా ఇసాగా మార్చుకుంది.  నిమిషా మరియు మెర్రిన్ ఫాతిమా, మరియమ్‌లు ఇస్లాంలోకి మారారు. వారి భర్తలు కూడా ఇస్లాంలోకి మారారు.
నిమిషా అలియాస్ ఫాతిమా కేరళలో ఐసీస్ అబ్దుల్ రషీద్ వివాహం చేసుకుంది. మే 2016లో చదువు కోసం శ్రీలంకకు వెళుతున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి భారత్‌ను విడిచిపెట్టింది. కానీ ఆమె తన భర్త మరియు ఇతరులతో కలిసి ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి సిరియాకు వెళ్లింది. నివేదికల ప్రకారం 2016 జూన్-జూలైలో నిమిషా ఉమ్ము కులుసు అనే అమ్మాయికి జన్మనిచ్చింది. కొంతకాలం తర్వాత సిరియా నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లారు. 2016 ఆగస్టులో ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 21 మంది పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
ఐసీస్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ చనిపోయిన తర్వాత, అక్కడి బలగాలతో జరిగిన పోరాటంలో తమ భర్తలు మరణించిన తర్వాత 10 మంది మహిళలు మరియు 21 మంది పిల్లలు (నిమిషా మరియు ఉమ్ము కులుసుతో సహా) అక్టోబర్ 2019లో ఆఫ్ఘన్ అధికారుల ముందు లొంగిపోయారు. ఆ తర్వాత వారిని జైల్లో పెట్టారు.
కేరళలో, ఫాతిమా తల్లి బిందు కె తన కుమార్తె మరియు నాలుగేళ్ల మనవరాలిని స్వదేశానికి రప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.  తన కుమార్తె పెళ్లి లేదా ‘లవ్ జిహాద్’ ద్వారా ఇస్లాం మతంలోకి మారిందని బిందు అన్నారు. తీవ్రవాద గ్రూపుల మత మార్పిడుల పై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారుభారత దర్యాప్తు సంస్థలు కాబూల్‌లో పిల్లలతో నివసిస్తున్న నలుగురు మహిళలను ఇంటర్వ్యూ చేశాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆ మహిళలలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి అనుకూలమైన, బలమైన వైఖరితో ఉన్నారని దర్యాప్తు సంస్థలు తెలుసుకున్నాయి. అందువల్ల ఐసీస్ లో చేరిన ఆ నలుగురు కేరళ మహిళలు భారత్ కు తిరిగి వచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. వారు ఐసీస్ లో చేరిన నలుగురు కేరళ మహిళలైన సోనియా అలియాస్ ఆయిషా, మెరిన్ జాకబ్ అలియాస్ మరియం, నిమిషా అలియాస్ ఫాతిమా, రఫెలా.

Also Read: BICHAGADU 2 REVIEW : “విజయ్ ఆంటోని” నటించి, దర్శకత్వం వహించిన బిచ్చగాడు 2 ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like