“గుంటూరు కారం” సినిమాకి “త్రివిక్రమ్” రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసా.?

“గుంటూరు కారం” సినిమాకి “త్రివిక్రమ్” రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసా.?

by Mounika Singaluri

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా నిహారిక అండ్ హాసిని బ్యానర్ పైన రాధాకృష్ణ నిర్మించారు. మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించారు. మహేష్ బాబుకి తల్లిగా రమ్యకృష్ణన్ నటించారు. మీనాక్షి చౌదరి ఒక ముఖ్య పాత్రలో నటించారు. తల్లి, కొడుకుల మధ్య ఈ సినిమా నడుస్తుంది. సినిమా స్టోరీ రొటీన్ గానే ఉంది. చాలా సార్లు చూసిన కథనే అవ్వడంతో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా నచ్చింది.

Video Advertisement

గుంటూరు కారం సినిమాకి ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు 40 కోట్లు వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా అందరి రెమ్యూనరేషన్ లతో కలిపి బడ్జెట్ 200 కోట్లు అయ్యింది. ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారు అంట. అల వైకుంఠపురంలో కూడా ఇదే బ్యానర్ లో వచ్చిన సినిమానే. అలా వైకుంఠపురం సినిమాకి 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారు త్రివిక్రమ్. అప్పటికి ఇప్పటికి ఆయన రెమ్యూనరేషన్ డబల్ అయ్యింది అయితే.


End of Article

You may also like