Ads
టీ 20 వరల్డ్ కప్ లో టీం ఇండియాకి రెండో సారి కూడా ఓటమే ఎదురైంది. ఇక సెమిస్ కి చేరడం కష్టమే. పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లో చేసిన పొరపాట్లని టీం ఇండియా ఆటగాళ్లు మరోసారి చేసారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 110 పరుగుల అత్యల్ప స్కోరు చేసింది. రవీంద్ర జడేజా 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టాప్ ఆర్డర్ బాట్స్మెన్ అందరు చేతులెత్తేశారు.
Video Advertisement
ఇక 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ డారిల్ మిచెల్ 49 పరుగులతో రాణించాడు. విలియమ్సన్ 33 మిగతాపనిని పూర్తి చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో కివీస్ సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
#14.
End of Article