ఆ లారీ డ్రైవర్ చేసిన పని వీరి ప్రాణాల మీదకు తెచ్చింది..! ఈ దారుణం గురించి తెలిస్తే కన్నీళ్లే..!

ఆ లారీ డ్రైవర్ చేసిన పని వీరి ప్రాణాల మీదకు తెచ్చింది..! ఈ దారుణం గురించి తెలిస్తే కన్నీళ్లే..!

by Mohana Priya

Ads

బెంగళూరులో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. హసన్ పట్టణం దగ్గరలో శివానంద్, జ్యోతి గత ఆదివారం రోజు రాత్రి ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ వారి బైక్ ని ఢీ కొట్టింది.

Video Advertisement

ఈ ప్రమాదంలో శివానంద్ జ్యోతి తో పాటు ఉన్న వారి ఇద్దరు కవల పిల్లలు లారీ చక్రాల కింద నలిగి దాదాపు రెండు కిలోమీటర్లు వరకు వెళ్లి ముక్కలు అయ్యారు. ఆ కవల పిల్లల పేర్లు ప్రణతి, ప్రణవ్. వారికి మూడు సంవత్సరాలు. వారిద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శివానంద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం, అక్కడ ఉన్న స్థానికులు ఆ లారీ డ్రైవర్ ని పట్టుకోడానికి ప్రయత్నించారు. హోసకొప్పలు పట్టణం దగ్గర లారీని ఆపారు. ఆ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

truck hit a bike near bengaluru outskirts

ఈ క్రమంలో అతను మరొక 2 బైక్ లని ఢీ కొట్టాడు. స్థానికులు ఆ డ్రైవర్ ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ద న్యూస్ మినిట్ కథనం ప్రకారం, పోలీసులు మాట్లడుతూ, ఈ ఘటన హాసన్ శివార్ల దగ్గర జరిగింది అని, ఈ బైక్ ని ఢీకొట్టే ముందు ఆ లారీ మరొక నాలుగు వాహనాలను కూడా ఢీకొట్టింది అని తెలిపారు. ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే కారణం అని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు డ్రైవర్ ని విచారిస్తున్నారు.


End of Article

You may also like