మిస్టరీగా మిగిలిన బెస్ట్ ఫ్రెండ్స్ ఆత్మహత్య.. సొంతూరుకు వెళ్తున్నానని చెప్పి.. అంతలోనే ఘోరం.. అసలేమి జరిగింది..?

మిస్టరీగా మిగిలిన బెస్ట్ ఫ్రెండ్స్ ఆత్మహత్య.. సొంతూరుకు వెళ్తున్నానని చెప్పి.. అంతలోనే ఘోరం.. అసలేమి జరిగింది..?

by Megha Varna

Ads

ఇద్దరు ప్రాణ స్నేహితులు బలవన్మరణానికి పాల్పడటం జరిగింది. అది ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే ఇద్దరమ్మాయిలకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. చదువులో కూడా సమస్యలు లేవు. ప్రేమ వంటివి కూడా లేవు. అయితే ఏ సమస్య లేదు మరి ఎందుకు చనిపోయారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పైగా ఈ ఆడపిల్లలు ఇద్దరూ కూడా ప్రాణ స్నేహితులు అన్న విషయం తల్లిదండ్రులకు తెలియదు. అయితే ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

Video Advertisement

యాడికి మండలం కమలపాడు గ్రామానికి చెందిన కళ్యాణి (18) గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతోంది. యాడికి పట్టణంలోని హాస్పిటల్ కాలనీలో పూజిత (18) నివాసముంటోంది. పూజిత సరస్వతి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదువుతోంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు. అయితే ఒక రోజు జగనన్న విద్యా దీవెన పథకం కి సంబంధించిన పని ఉందని కళ్యాణి తాడిపత్రి నుంచి యాడికి మండలం కమలపాడు గ్రామ సచివాలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళింది.

పూజిత కాలేజ్ కి వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరింది. తాడిపత్రిలో ఆర్టీసీ బస్సు ఎక్కి వీళ్ళిద్దరూ కూడా కడప కి వెళ్లారు. కడప బస్టాండ్ లో సెల్ఫీ కూడా తీసుకున్నారు. మధ్యాహ్నం వీళ్ళు కడప రైల్వే స్టేషన్ కి వెళ్ళారు. రాజంపేట వైపు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుంటే రైల్వే సిబ్బంది ఇలా రాకూడదు అని చెప్పగా.. వాళ్ళు రోడ్డుమీద కి వెళ్లి ఆటో ఎక్కి భాకరాపేట రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళారు.

వీళ్ళిద్దరూ పట్టాలపై వెళ్తుంటే.. గూడ్స్ రైలు వస్తోంది. వీళ్ళని చూసిన డ్రైవర్ వేగాన్ని తగ్గించాడు. వీళ్ళు పట్టాలు దిగిపోయారు. దీంతో ట్రైన్ వేగం మళ్ళీ పెరిగింది. వెంటనే ఒకేసారి ఇద్దరూ పట్టాలపై పడ్డారు. కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందింది. పూజితని ఆసుపత్రిలో చేర్చగా ఆమె కూడా మృతి చెందింది. అయితే అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

పైగా వీళ్ళిద్దరూ స్నేహితులన్న సంగతి కూడా తల్లిదండ్రులకి తెలియదని చెప్పారు. ఇదిలా ఉంటే సోమవారం అనంతపురంలో అదృశ్యమైన మరో ముగ్గురు అమ్మాయిల ఆచూకి ఆలస్యంగా తెలిసింది. అయితే ఈ ముగ్గురు అమ్మాయిలకి ఆ ఇద్దరు అమ్మాయిలకి ఏమైనా లింక్ ఉందేమో అని పోలీసులు పరిశీలిస్తున్నారు.


End of Article

You may also like