“మనసంతా నువ్వే” లో “ఉదయ్ కిరణ్” కంటే ముందు హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా.?

“మనసంతా నువ్వే” లో “ఉదయ్ కిరణ్” కంటే ముందు హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా.?

by Mohana Priya

Ads

ఉదయ్ కిరణ్, రీమా సేన్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం మనసంతా నువ్వే. సినిమా వచ్చి 19 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ సినిమా చూస్తున్నప్పుడు కొత్త గానే అనిపిస్తుంది. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య టేకింగ్ అంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఈ సినిమాని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం. ఎస్. రాజు నిర్మించారు.

Video Advertisement

ఈ సినిమాకి ఆర్.పి.పట్నాయక్ అందించిన పాటలు కూడా అన్ని బాగుంటాయి. అందుకే మనసంతా నువ్వే ఆల్బమ్ అప్పట్లో టాప్ ఆల్బమ్ గా నిలిచింది. మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ నటనని ఇప్పటికి కూడా మర్చిపోలేము. వేణు పాత్రలో చాలా బాగా నటించారు ఉదయ్ కిరణ్. కానీ ఈ సినిమాలో హీరో పాత్రకి మొదటి ఛాయిస్ ఉదయ్ కిరణ్ కాదు.

మనసంతా నువ్వే సినిమాలో హీరోగా ముందు మహేష్ బాబు ని అప్రోచ్ అయ్యారట. 2001లో ఎం.ఎస్. రాజు బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి మహేష్ బాబు ఒప్పుకున్నారు. అందుకే మనసంతా నువ్వే కథని ముందు మహేష్ బాబు కి చెప్పారు.

కానీ ఒక కమర్షియల్ జోనర్ లో ఉండే సినిమా చేద్దామని ఎదురు చూస్తున్న మహేష్ బాబు ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ నటించారు. మనసంతా నువ్వే సినిమాకి డైరెక్షన్, పాటలు, నటీనటుల పర్ఫామెన్స్ లతో పాటు డైలాగ్స్, ఇంకా సునీల్ కామెడీ కూడా హైలైట్ గా నిలిచాయి.

 


End of Article

You may also like