Ads
“మీటూ ఉద్యమం” ఆ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమా ఇండస్ట్రీలో ఎందరో నటీమనులు తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న చేదుఘటనలు బయటికి చెప్పుకున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలోనైతే కాస్టింగ్ కౌచ్ పై పెద్ద దుమారమే రేగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ వార్తలు తగ్గినప్పటికి అడపాదడపా హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తున్నారు. ఇప్పుడు వాణి భోజనం చేసిన కామెంట్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యింది.
Video Advertisement
టీవీ 9 కథనం ప్రకారం…పడక గదికి వస్తేనే ఆఫర్ లు ఇస్తామని చెప్పారని ఓ చిత్ర యూనిట్ పై ఫైర్ అయ్యారు వాణి. తాను అందుకు ఒప్పుకోలేదని ఆ సినిమా నిర్మాత తనని సినిమా నుండి తప్పించారని పేర్కొంది వాణి. ఆ సంఘటన వల్ల మనస్థాపానికి గురైందంట. అయితే ఆ చిత్ర యూనిట్ గురించి గానీ, నిర్మాత ఎవరు అనే విషయం గురించి కానీ బయటపెట్టలేదు వాణి. ఇప్పుడు ఆ నిర్మాత ఎవరు అనే విషయం చర్చనీయాంశం అయ్యింది.
ప్రస్తుత పరిస్థితుల్లో టాలెంట్ ని చూసి ఎవరు ఎంకరేజ్ చెయ్యట్లేదు. పడక గదికి వస్తేనే ఆఫర్ లు ఇస్తారు అంటూ ఫైర్ అయ్యింది వాణి. అంతేకాదు మహిళలను అవసరానికి వాడుకొనే వస్తువులుగా చూసేవారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది అంట వాణి.
అంతేకాదు NDTV కథనం ప్రకారం.. సినీ ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే , నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ సంచలనం సృష్టించింది నటి, హిందీ బిగ్బాస్-13 మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. పెద్ద నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను అత్యాచారం చేయాలని ప్రయత్నించాడంటూ చెప్పుకొచ్చింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాలు , సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమైన నటి రష్మీ దేశాయ్. సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ 13 లో థర్డ్ రన్నరప్ కూడా. ఆ తర్వాత వెండితెరపై కూడా కనిపించింది. ఇటీవల ఒక ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.
End of Article