గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ వాణిశ్రీ..! ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే..?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ వాణిశ్రీ..! ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే..?

by kavitha

Ads

అలనాటి హీరోయిన్ వాణిశ్రీ అందం, అభినయంతో అప్పటి ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు ఎవరా అని చర్చలు జరుగుతున్న సమయంలో  కళాభినేత్రి వాణిశ్రీ తెలుగు ఇండస్ట్రీలోకి  దూసుకొని వచ్చింది.

Video Advertisement

నవలా నాయికగా గొప్ప పేరు తెచ్చుకుంది. సావిత్రి ప్రభావం తనపై పడకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును  తెచ్చుకున్నారు. దశాబ్దం పాటు తెలుగు ఇండస్ట్రీని మహారాణిలా ఏలారు. ఆ సమయంలో ఏ చిత్రం రిలీజ్ అయినా అందులో హీరోయిన్ మాత్రం వాణిశ్రీనే.
పల్లెటూరి పొగరుబోతు అమ్మాయి క్యారెక్టర్ అయినా, ఆత్మాభిమానం కల మధ్యతరగతి యువతి క్యారెక్టర్ అయినా,   అందం అణుకువ ఉన్న అమ్మాయి అయినా, నవలా నాయికగా నటించాలన్నా అది వాణిశ్రీకి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు. ఆ అదృష్టం ఆమెకే దక్కింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాలతో కలిపి సుమారు 95 సినిమాలలో నటించిన వాణిశ్రీ, ఆ రోజుల్లో అందరికన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది.
వాణిశ్రీ అసలు పేరు  రత్న కుమారి. 1962 లో భీష్మ తెలుగు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదట్లో కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు చేసిన ఆమె. ఆ తరువాత అగ్ర హీరోయిన్ గా ఎదిగారు. ఆమె 40 ఏళ్ల  సినీ కెరీర్‌లో 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, సౌత్ , నంది అవార్డులు మరియు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు. వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా ఉన్న టైమ్ లోనే డా. కరుంకరన్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. వారికి  ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
1989 లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. కొడుకు పుట్టిన తరువాత థైరాయిడ్ సమస్య ఏర్పడి, వాణిశ్రీ బాగా లావయ్యారని తెలుస్తోంది. తాజాగా తిరుమలకు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారు వాణిశ్రీ ఇలా మారిపోయరేంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: JIGARTHANDA DOUBLEX REVIEW : “రాఘవ లారెన్స్, SJ సూర్య” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like