అప్పుడు రామ్ చరణ్ – ఉపాసన, బన్నీ-స్నేహ లు వెళ్లిన ప్లేస్ కే ఇప్పుడు వరుణ్ – లావణ్య.!

అప్పుడు రామ్ చరణ్ – ఉపాసన, బన్నీ-స్నేహ లు వెళ్లిన ప్లేస్ కే ఇప్పుడు వరుణ్ – లావణ్య.!

by Mounika Singaluri

Ads

నవంబర్ ఒకటవ తేదీన వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా చాలా జాగ్రత్తగా పడ్డారు. ఆఖరికి పెద్దల ఆశీర్వచనంతో జూన్ లో నిశ్చితార్థం చేసుకొని నవంబర్ 1వ తేదీన పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇటలీలో కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట తరువాత హైదరాబాద్ లోనూ, డెహ్రాడూన్ లోను రిసెప్షన్ వేడుకలు చేసుకున్నారు.

Video Advertisement

ఆ తరువాత ఈ జంట హనీమూన్ కి వెళ్లారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ హనీమూన్ ప్లేస్ పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఇంతకీ విషయం ఏమిటంటే లావణ్య దంపతులు హనీమూన్ కి ఫిన్లాండ్ కి వెళ్లారు. అక్కడికే రామ్ చరణ్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులు కూడా పెళ్లయిన కొత్తలో హనీమూన్ కి వెళ్లారు. ఇప్పుడు అదే విషయాన్ని పట్టుకొని మెగా ఫ్యామిలీ హనీమూన్ సెంటిమెంట్ దేశం అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ఫిల్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ దేశం మాత్రమే కాకుండా వీరిద్దరూ సరికొత్తగా మరికొన్ని దేశాలు చుట్టి రావాలని భారీ ప్లాన్ లోనే ఉన్నారు. ఇకపోతే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ మొదటిసారి మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి అభిప్రాయాలు కలవటంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇటలీలో గుర్తించినట్లు, అందుకు గుర్తుగానే వారి పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకున్నట్లు వరుణ్ సన్నిహితులు చెప్తున్నారు. మిస్టర్ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం అనే సినిమాలో కూడా నటించారు అయితే విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి.


End of Article

You may also like