విమల్ కృష్ణ ”డీజే టిల్లు సీక్వెల్” నుండి తప్పుకోవడానికి కారణం అదే ఆ..?

విమల్ కృష్ణ ”డీజే టిల్లు సీక్వెల్” నుండి తప్పుకోవడానికి కారణం అదే ఆ..?

by Megha Varna

Ads

డీజే టిల్లు సినిమా అందరినీ బాగా అలరించింది. ఈ సినిమా లో సిద్దు ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ చాలా నాచురల్ గా ఉన్నాయి. రాధికగా నేహా శెట్టి నటించారు. మిగిలిన పాత్రల్లో నటించిన ప్రిన్స్, నర్రా శ్రీను, ప్రగతి, బ్రహ్మాజీ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

Video Advertisement

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం కూడా బాగుంది. ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు.

Dj tillu movie review

ఈ సినిమా ఫిబ్రవరి 12, 2021 విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాగా అలరించడంతో దీనికి సీక్వెల్ ని తీసుకు వద్దామని అనుకున్నారు. సీక్వెల్ ఉంటుంద‌ని అప్ప‌ట్లోనే చెప్పేసారు కూడా. తాజాగా దీపావళి నాడు ఈ సినిమా సీక్వెల్ ఉంటుంద‌ని అన్నారు. కానీ డీజే టిల్లు సీక్వెల్ కి విమ‌ల్ కృష్ణ దర్శకత్వం చేయడం లేదు. దానికి కారణం ఇదే అని డీజే టిల్లు దర్శకుడు విమ‌ల్ కృష్ణ అన్నారు. ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించడం లేదు. ‘మల్లిక్ రామ్’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మొదట డీజె టిల్లు సీక్వెన్స్ చేద్దామని డైరెక్టర్ ని అడిగారు కానీ దానిమీద ఆసక్తి లేదని డైరెక్టర్ చెప్పేశారు.

ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేసినా సరే చాలా దృఢంగా ఉండాలని.. ఫస్ట్ టైం క్రియేట్ చేస్తే దాని మీద ఇంపాక్ట్ బాగా ఉంటుందని ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో వస్తే అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారని మొదటి సారి మాత్రమే ధృడంగా ఉంటుంది అదే నాకు నచ్చుతుంది అని చెప్పారు. ఇక టిల్లు స్క్వేర్ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సిద్దు సరసన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.


End of Article

You may also like