భార్య చదువుకి డబ్బుల కోసం దుబాయ్ వెళ్ళాడు..! తిరిగొచ్చి చూసేసరికి..?

భార్య చదువుకి డబ్బుల కోసం దుబాయ్ వెళ్ళాడు..! తిరిగొచ్చి చూసేసరికి..?

by Megha Varna

ఈ రోజుల్లో డబ్బు మీద అందరికీ ఆశ పెరిగిపోతోంది. సంపాదించే మార్గం గురించి ఎవరూ ఆలోచించటం లేదు. డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉండడం వల్ల ఎవరి గురించి ఆలోచించకుండా అడ్డదారుల్లో వెళ్తున్నారు. డబ్బుకు సంబంధించి ఒక సంఘటన ఈ మధ్య కాలంలో ఒకరి కధ వైరల్ గా మారింది. దాని గురించి చూద్దాం.

Video Advertisement

కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజు అతని తల్లిదండ్రులను చిన్న వయసులో పోగొట్టుకోవడంతో ఒక మెకానిక్ షాపులో పని నేర్చుకున్నాడు. కొన్ని సంవత్సరాలకి సొంత మెకానిక్ షెడ్ ను ప్రారంభించే స్థాయికి ఎదిగాడు మరియు నలుగురు అనాథలకు ఉపాధి కూడా కల్పించాడు.

పెళ్ళి వయసు వచ్చే సరికి సన్నిహితులు మరియు బంధువులు చెప్పడంతో రాజుకి దూరం చుట్టం అయినా ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది, ఆమెకు ఇంకా చదవాలని ఉండడంతో డిగ్రీ పూర్తయ్యే వరకు చదివించాడు.

ఆ తరువాత ఆ యువతి పై చదువులు చదువుతాను అని చెప్పడంతో, ఆర్ధిక ఇబ్బంది ఉండడం వల్ల అతని భార్యను చదివించడానికి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ బాగా కష్టపడి పది లక్షలు పైగా సంపాదించి భార్యకు పంపించాడు. అయితే అప్పటికే రాజు భార్య ఇంకో వ్యక్తితో ప్రేమ లో ఉంది. దుబాయ్ లో రాజు చేసిన ఎగ్రిమెంట్ పూర్తవడంతో తన భార్యను చూడాలని ఎంతో ఆశతో ఇంటికి తిరిగి వచ్చాడు.

అయితే అప్పటికే ఆ యువతి తను ప్రేమించిన వ్యక్తి తో ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఈ సంఘటన గురించి రాజుకు తన బంధువులు చెప్పడంతో పిచ్చివాడు అయిపోయాడు. ఇలాంటి మోసాన్ని ఎదుర్కోవడం వల్ల ఇప్పుడు దీనస్థితిలో బతుకుతున్నాడు. కనీసం అన్నం తినడానికి కూడా డబ్బులు లేకుండా జీవిస్తున్నాడు. కానీ మోసం చేసిన ఆ యువతి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.


You may also like