తమిళ్ స్టార్ హీరో ధనుష్, ధనుష్ భార్య ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా వారి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు వారిద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ వార్త చాలా మంది అభిమానులు షాక్ అయ్యేలా చేసింది. మామూలుగా వీరిద్దరికీ బెస్ట్ కపుల్ అని పేరు ఉంది.
Video Advertisement
అంతకుముందు ఐశ్వర్య కోసం ధనుష్ పాట పాడిన వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది. అంత బాగా ఉన్నవాళ్లు సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ చాలా మంది కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ధనుష్, ఐశ్వర్యలది ప్రేమ వివాహం. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగే సమయానికి ధనుష్ వయసు 21 అయితే, ఐశ్వర్య వయసు 23 సంవత్సరాలు.
తర్వాత నుండి ఇద్దరు కూడా వృత్తి పరంగా చాలా పైకి ఎదిగారు. ధనుష్ అయితే కేవలం తమిళ్ సినిమా కి మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకి పేరు తెచ్చే నటుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల అసురన్ సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు. అసలు ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకునే ముందు ఏం జరిగింది? అనే ప్రశ్న చాలా మందిలో నెలకొంది. కానీ వారిద్దరూ విడాకులకు ముందు కూడా మామూలుగానే ఉన్నట్టు సమాచారం. ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైంది. సినిమా లాంచ్ ఈవెంట్ కి కూడా ఐశ్వర్య వచ్చారు.
అలాగే సోషల్ మీడియాలో కూడా ఒకరిపై ఒకరు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లయిన తర్వాత కూడా కొన్ని సార్లు గొడవలు అయ్యాయని, అవి రజినీకాంత్ పరిష్కరించారని, దాంతో ఆ గొడవలు పెద్దగా బయటికి రాలేదని, ధనుష్, ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా అసలు అలాంటివి ఏవి జరగనట్టు, అంతా మామూలుగానే ఉన్నట్టు కనిపించేలా జాగ్రత్తలు పడ్డారు అనే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు అయితే ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు కానీ, లేదా ఇద్దరూ దూరంగా ఉంటున్నట్టు కానీ ఎలాంటి సూచనలు కూడా కనిపించలేదు. దాంతో అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇంకొక విషయం కూడా ప్రచారం అవుతోంది. అదేంటంటే ఈ సారి వీరిద్దరూ విడిపోవాలని బలమైన నిర్ణయం తీసుకున్నారు అని, దాంతో రజనీకాంత్ కూడా ఏం మాట్లాడలేకపోయారు అనే వార్తలు వస్తున్నాయి.