మొన్న RRR… ఇప్పుడు విక్రమ్..! “మహేష్ బాబు” కి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది..?

మొన్న RRR… ఇప్పుడు విక్రమ్..! “మహేష్ బాబు” కి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది..?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా గుర్తింపు పొందారు. స్పైడర్ సినిమాతో డైరెక్ట్ తమిళ్ సినిమాలో కూడా నటించారు. మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని చాలా తక్కువగా షేర్ చేస్తారు.

Video Advertisement

కానీ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడటంలో మాత్రం మహేష్ బాబు ముందుంటారు. మహేష్ బాబు ఏదైనా సినిమా చూస్తే, దాని గురించి సోషల్ మీడియాలో తప్పక మాట్లాడుతారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు కూడా చూసి, వాటిపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపి, అలాగే ఆ సినిమాకి పనిచేసిన వారందరిని అభినందిస్తూ ఉంటారు.

కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా ఏ హీరో సినిమా అయినా సరే చూసి, మహేష్ బాబు సినిమా బృందాన్ని అభినందిస్తూ ఉంటారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంతో చాలా మంది నెటిజన్లు కూడా, “మహేష్ బాబు ఇలా సినిమా చూసి తన అభిప్రాయం తెలపడం అనేది చాలా మంచి విషయమని” మెచ్చుకుంటూ ఉంటారు. మహేష్ బాబు కేవలం ఎక్స్పరిమెంటల్ సినిమాలు అని మాత్రమే కాకుండా సినిమా కమర్షియల్ అయినా సరే లేదా వేరే ఏది అయినా సరే తన అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం మహేష్ బాబు ఇలా అభిప్రాయం తెలిపినప్పుడు సినిమా బృందం వారు సరిగ్గా స్పందించకపోవడం అనేది జరుగుతూ ఉంది.

why this happened only with mahesh babu

మహేష్ బాబు అఖండ చూసి సినిమా బృందాన్ని అభినందించారు. కానీ తర్వాత వారిలో ఏ ఒక్కరు కూడా మహేష్ బాబుకి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేయలేదు. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రమే మహేష్ బాబు ట్వీట్ కి స్పందించి థాంక్స్ చెప్పారు. అలాగే తర్వాత పుష్ప సినిమా బృందాన్ని కూడా మహేష్ బాబు అభినందించారు. వారిలో కొంతమంది మహేష్ బాబు ట్వీట్ చూసి థాంక్స్ అని చెప్పారు. ఇటీవల ఈ సంవత్సరం విడుదల అయ్యి ఎంతో పెద్ద విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసి కూడా మహేష్ బాబు సినిమా బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. వారిలో ఏ ఒక్క హీరో కానీ, డైరెక్టర్ కానీ మహేష్ బాబు ట్వీట్ కి స్పందించలేదు. ఇటీవల విక్రమ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. మహేష్ బాబు విక్రమ్ సినిమా బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

why this happened only with mahesh babu

అంతే కాకుండా ట్వీట్ లో సినిమాలో నటించిన వారిని, సినిమాకి పనిచేసిన వారందరినీ కూడా ట్యాగ్ చేశారు. సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ తప్ప మహేష్ బాబు ట్వీట్ కి ఎవరు స్పందిస్తూ థాంక్స్ చెప్పలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అయితే సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో షేర్ చేసి దానికి రిప్లై ఇస్తున్నారు. కానీ ఇంత పెద్ద స్టార్ హీరో చేసిన ట్వీట్ ఎలా మిస్ అయ్యారు. ట్వీట్ చేసి ఇన్ని రోజులైనా సరే రిప్లై కూడా ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు నేటిజెన్లు అందరూ, “నీకు ఇంత మంచితనం పనికిరాదు అన్నా. సినిమాని పొగిడినప్పుడు వాళ్ళందరిని ట్యాగ్ చేయకు. వాళ్ళు ఎవరు రిప్లై కూడా ఇవ్వట్లేదు” అని కామెంట్స్ పెడుతున్నారు.

why this happened only with mahesh babu

అంతే కాకుండా ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట విడుదలయ్యి కమర్షియల్ విజయం సాధించింది. ఈ సినిమాపై కూడా ఏ ఒక్క స్టార్ హీరో ట్వీట్ చేయలేదు. దాంతో అప్పుడు కూడా, “అదేంటి? మహేష్ బాబు ఏ హీరో సినిమా విడుదలైనా సరే దానిపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. మహేష్ బాబు సినిమా విడుదల అయినప్పుడు ఎవరు ఎందుకు స్పందించలేదు” అని కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా, “మహేష్ బాబు ట్వీట్ కి వీళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు” అని అంటున్నారు. “ట్వీట్ చేసి ఇన్ని రోజులు అయ్యింది. కనీసం ఇప్పటికైనా ఒక్క సారి స్పందించి థాంక్స్ చెప్పాలి కదా?” అని అంటున్నారు.


End of Article

You may also like