17 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది.. ఆ ఇద్దరే కారణమా..?

17 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది.. ఆ ఇద్దరే కారణమా..?

by kavitha

Ads

ఇండియన్ బాక్సాఫీస్‏ను ప్రస్తుతం ఎలుతున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరక్కేకిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తోంది. వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.

Video Advertisement

ఈ చిత్రం విజయం సాధించడంతో ఇందులో నటించిన నటీనటులు దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. వీరి గురించే అందరూ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 17 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఎవరో ఇప్పుడు చూద్దాం..
సలార్ మూవీ హిట్ తో పాపులర్ అయిన నటినటులలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రియా రెడ్డి. ఆమె సలార్ లో రాజమన్నార్ కుమార్తె, రాధా రామ మన్నార్ క్యారెక్టర్ లో అద్బుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీ ముందు కోలీవుడ్ లో మాత్రమే పాపులర్ అయిన శ్రియా రెడ్డి, ఈ మూవీ రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పాన్ ఇండియా స్టేటస్ పొందారు.
తన నటనతో అందర్నీ ఆమె వైపుకు తిప్పుకున్నారు. దాంతో ఆమె గురించి తెలుసుకోవ డానికి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలో ఆమె నటించిన తిమిరి తెలుగులో పొగరు సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ చిత్రం 2006 లో రిలీజ్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ విశాల్ ఈ మూవీలో హీరోగా నటించారు. రీమాసేన్ హీరోయిన్ గా నటించగా, ఈశ్వరి పాత్రలో శ్రియా రెడ్డి నటించారు. ఈ చిత్రలో ఈశ్వరిగా శ్రియా రెడ్డి తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈశ్వరి పాత్రలో ఒదిగిపోయి, హీరోతో పోటీ పడి నటించారు. ఈ మూవీ ట్రెండింగ్ లోకి రావడానికి మరో కారణం జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్. పొగరు సినిమాలో వినాయకన్ నటించాడు. ఈశ్వరి పాత్రకు సహకరించే పాత్రలో మాయిగా వినాయకన్ నటించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, వీరిద్దరు సలార్, జైలర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు.


End of Article

You may also like