50000 మద్యం కొన్నట్టు బిల్ పోస్ట్ చేసాడు…చివరికి ఏమైందో తెలుసా?

50000 మద్యం కొన్నట్టు బిల్ పోస్ట్ చేసాడు…చివరికి ఏమైందో తెలుసా?

by Sainath Gopi

Ads

నిన్నటి నుండి కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. గ్రీన్ జోన్స్ లో మద్యం అమ్మకాలు జరిగాయి. ఇన్ని రోజులు మద్యం దొరకకపోవడం వల్ల మందు బాబులు అందరు మద్యం కోసం వైన్ షాప్స్ దగ్గర ఒక్కసారిగా ఎగబడ్డారు. సామజిక దూరం చాలామంది పాటించలేదు. కేవలం ఒక్క రోజే కొన్ని కోట్ల ఆదాయం వచ్చింది మద్యం అమ్మకాల వల్ల. కొన్నిచోట్ల మహిళలు కూడా వైన్ షాప్స్ దగ్గర లైన్ లో నించున్నారు.ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైన్ షాప్ ఓపెన్ చేయాలి రూల్ పెట్టారు. నియంత్రించేందుకు మద్యం ధరలను కూడా పెంచారు. కానీ ధరలు పెరిగినా మందు బాబులు మాత్రం అస్సలు వెనకడుగు వేయలేదు.

Video Advertisement

లాక్ డౌన్ కారణంగా మందుబాబులు 45 రోజులు లిక్కర్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. తర్వాత లాక్ డౌన్ ఇంకెన్ని రోజులు ఉంటుందో అనే ఆలోచనతో మందుకు కొరత లేకుండా కొని పెట్టుకునేందుకు పోటీ పడ్డారు మందుబాబులు. బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా 52, 841 రూపాయల విలువ చేసే లిక్కర్ కొనుగోలు చేశాడు. ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అనుమతించిన దాని కన్నా ఎక్కువ మద్యాన్ని అమ్మడంటూ షాప్ ఓనర్ పై కేసు బుక్ చేశారు. రూల్స్ ప్రకారం ఒక్క రోజు ఒక వ్యక్తికి 2.6 లీటర్ల మద్యం మాత్రమే అమ్మాలి. బీర్ అయితే 18 లీటర్ల వరకు అనుమతి ఉంది.

కానీ నిన్న బెంగళూరులో వనిల్లా స్పిరిట్‌ జోన్‌ ఏకంగా 13.5 లీటర్ల లిక్కర్‌, 35 లీటర్ల బీర్‌ ను అమ్మింది. దీంతో షాప్ ఓవర్ పై కేసు పెట్టటంతో పాటు బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసారంట. షాప్ ఓనర్ మాత్రం అది 8 మంది వినియోగదారులకు సంబంధించిన బిల్లు అని చెబుతున్నాడు.


End of Article

You may also like