21 ఏళ్ళు కూడా లేవు.. భర్తని చంపించడానికి సినిమాటిక్ రేంజ్ లో ప్లాన్.. ఈమె స్టోరీ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది..

21 ఏళ్ళు కూడా లేవు.. భర్తని చంపించడానికి సినిమాటిక్ రేంజ్ లో ప్లాన్.. ఈమె స్టోరీ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది..

by Megha Varna

Ads

పెళ్లి అయ్యి కేవలం ఇరవై రెండు రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే భారీ రేంజ్ లో స్కెచ్ వేసింది భార్య. అసలు దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళ్ నాడు రాష్ట్రానికి చెందిన భువనేశ్వరిని కేబుల్ టీవీ లో పనిచేసే గౌతమ్ కి ఇచ్చి పెళ్లి చేసారు. అయితే పెళ్లి అయిన 22 రోజులకే భర్తని చంపించాలని అనుకుంది. 18 ఏళ్ల వయసులోనే భువనేశ్వరికి పోలీస్ డిపార్ట్మెంట్ లో చిన్న ఉద్యోగం వచ్చింది. ఆరు నెలల ట్రైనింగ్ కూడా ఆమె తీసుకుంది. చూడ్డానికి అమాయకంగా కనిపించే భువనేశ్వరి నిజానికి ఒక విలన్. ఓరోజు భార్య కొటేషన్ గ్యాంగ్ ని కలిసి భర్తను చంపించాలని అనుకుంది.

Video Advertisement

సినిమాల్లో చూపించినట్లు కాలుకి ఇంత, చెయ్యికి ఇంత అని డబ్బులు తీసుకుని కొట్టడం చంపడం లాంటివి ఆ గ్యాంగ్ చేస్తూ ఉండేవారు. ఈ గ్యాంగ్ లీడర్ పేరు ఆంటోని. బయట ఎవరికీ తెలియకుండా చంపాలని నాలుగు లక్షలు ఇస్తానని అడ్వాన్స్ కూడా ఇస్తానని భువనేశ్వరి చెప్పింది. ఒకవేళ కనుక తన పేరు బయటకు రాకుండా చంపేస్తే మరో లక్ష రూపాయలు ఇస్తానని చెప్పింది. అయితే భర్తని ఎందుకు చంపాలని అనుకుంటోంది అన్న సంగతి మాత్రం చెప్పలేదు. ఆమె దగ్గర నాలుగు లక్షలు నిజంగా ఉన్నాయా అని అనుమానం కలిగింది ఆంటోనికి.

సగం పేమెంటు ఇవ్వమన్నాడు. వెంటనే ఆమె తన మెడలో ఉన్న నెక్లెస్ తీసి ఇచ్చింది. అయితే ఎలా చంపాలి అని అడిగాడు. హైవే మీద ఒక గుడి ఉంది. ఆ గుడి దగ్గరకి తీసుకు వస్తాను అని చెప్పింది. ఆ తర్వాత అనుకున్నట్టుగానే భర్తతో బండి మీద గుడికి వెళ్ళింది. దారిలో కడుపు నొప్పిగా ఉందని వాష్ రూమ్ కి వెళ్ళాలని చెప్పింది. ఇంతలో ఒక చెట్టు దగ్గరికి ఆమె వెళ్లింది, భర్తని కూడా తోడుగా రమ్మంది. తిరిగి వచ్చేసరికి బండి టైర్ పంక్చర్ అయింది. మీరు బండి రిపేర్ చేసుకొని రండి నేను నెమ్మదిగా గుడికి వెళ్లి అక్కడ కూర్చుంటాను అని చెప్పింది. బండిని నెట్టుకుంటూ భర్త వెళ్తుండగా వేగంగా ఒక కారు వచ్చి బండిని ఢీకొంది.

గౌతమ్ ఒక గొయ్యి లో పడిపోయాడు. ఆ తర్వాత మళ్లీ రోడ్డు మీదికి వచ్చి నిలుచున్నాడు. ఇంతలో కొందరు వ్యక్తులు వచ్చి కొట్టడం మొదలుపెట్టారు. దారిన వెళ్తున్న ఒక కారు డ్రైవర్ ఏమైందని అడిగాడు. వెంటనే ఆ గ్యాంగ్ గౌతమ్ ని వదిలేసి పారిపోయారు. ఒక కారు డ్రైవర్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పోలీసులకి ఫిర్యాదు చేయాలని ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు చెప్పగా.. పోలీసులు వచ్చి విచారించారు. చంపాలని అనుకున్నది ఆంటోనీ అని తెలుసుకుని పోలీసులు పిలిచి విచారణ చేయగా భార్య భువనేశ్వరి పేరు బయటకు వచ్చింది. ఆమె నగలు, భర్త ఫోటో అన్నీ చూపించారు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా గౌతమ్ కి చెప్పలేదు. అయితే గౌతమ్ తన భార్యకు ఫోన్ చేసి తనని చంపాలనుకున్న వాళ్లు దొరికారు అని ఆనందంగా చెప్పాడు.

మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం తయారవ్వమని చెప్పాడు. సరే అని చెప్పింది. భర్త ఇంటికి వచ్చి చూసే సరికి ఉరి వేసుకుని చనిపోయింది భువనేశ్వరి. భువనేశ్వర్ ఏ చంపించాలని ఆఖరికి తెలిసింది. ఇది విన్న బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె తన భర్తను ఎందుకు చంపించాలని అనుకుంది అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఆమె ఎవరినైనా ప్రేమించి ఉండొచ్చేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ ఆమె చనిపోవడానికి కారణం పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న భయం అని తెలుస్తోంది.


End of Article

You may also like