ప్రియుడి మాయలో భర్తని మోసం చేసింది.. చివరికి ప్రియుడి చేతిలో చావుదెబ్బ.. అసలేం జరిగిందంటే..?

ప్రియుడి మాయలో భర్తని మోసం చేసింది.. చివరికి ప్రియుడి చేతిలో చావుదెబ్బ.. అసలేం జరిగిందంటే..?

by Megha Varna

Ads

ఒక వ్యక్తిని నమ్మి వాళ్ళ మాయలో పడిపోయి.. తానే సర్వస్వం అనుకుంటూ అమ్మాయిలు ఎంతకైనా తెగిస్తున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యే నయమని ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ప్రతి రోజూ మనం ఎలాంటి వార్త ఏదో ఒకటి వింటూనే ఉంటాం. తాజాగా మరొక సంఘటన చోటు చేసుకుంది. మూడు ముళ్ళు కట్టిన భర్తని వద్దనుకుని… ప్రియుడితో పాటు వెళ్ళిపోయింది ఒక మహిళ. ఆ తర్వాత చావే నయం అనుకుని ఆత్మహత్య చేసుకుంది.

Video Advertisement

కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లా లో ఇది చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… చిత్రదుర్గ జిల్లా కెంకెరె గ్రామానికి చెందిన దివ్య అనే 22 ఏళ్ల యువతిని తల్లిదండ్రులు ఒక యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన కొన్ని రోజుల వరకు వీళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. ఎంతో ప్రేమగా మెలిగారు. పెళ్లయి సంవత్సరం కూడా గడుస్తుందో లేదో ఈమె మరొక యువకుడితో పరిచయం పెంచుకుంది.

divya1

వీరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆమె తన భర్తతో ఉండకూడదని ప్రియుడితో వెళ్లి పోవాలని నిర్ణయం తీసుకుంది. అలా ఆమె ప్రియుడితో 3 నెలల క్రితం వెళ్ళిపోయింది. అతనితోనే మూడు నెలల నుంచి కలిసి ఉంటోంది. తన భర్త ఆమెను తిరిగి తీసుకు రావడానికి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజుల క్రితం నుండి కూడా దివ్య జ్వరంతో బాధ పడుతోంది.

ప్రియుడు తనని పట్టించుకోవడం మానేశాడు. డాక్టర్ కి కూడా ఆమెను చూపించలేదు. ఇక ఏమనుకుందో ఆమె సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయింది. అప్పటికే ఆమె మృతి చెందింది అని వైద్యులు తెలిపారు. సూసైడ్ లెటర్ లో తన ప్రియుడు మంజునాథ్ కొట్టి హింసిస్తున్నాడు అని.. ఆ హింసను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె రాసింది. భర్తను కాదని ప్రియుడితో వెళ్లి పోయిన అమ్మాయి చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటున్నారు.

 


End of Article

You may also like