వైఎస్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్, పెళ్లి పత్రికలు చూసారా..? ఇందులో ఏం రాసారంటే..?

వైఎస్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్, పెళ్లి పత్రికలు చూసారా..? ఇందులో ఏం రాసారంటే..?

by kavitha

Ads

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నియమితురాలైన వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనులలో బిజీ బిజీగా ఉన్నారు. షర్మిల కుమారుడి నిశ్చితార్ధం హైదరాబాద్‌లో రేపు అనగా జనవరి 18న గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుక కోసం ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి.

Video Advertisement

షర్మిల నిశ్చితార్ధం మరియు వివాహానికి అన్న వైఎస్ జగన్ తో పాటు స్వపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా  అందర్నీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా రాజారెడ్డి నిశ్చితార్ధ, పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వై ఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు రాజా రెడ్డి వివాహం ప్రియా అల్లూరితో ఫిబ్రవరి 17న జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లికి ఆహ్వానిస్తూ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
అంతేకాకుండా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలకు స్వయంగా ఆహ్వాన పత్రికలను ఇచ్చారు.  ఈ క్రమంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్ధం హైదరాబాద్ లో గండిపేటలోని  గోల్కొండ రిసార్ట్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలుస్తోంది. వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా షర్మిల ఆహ్వానించారు. అయితే ఈ నిశ్చితార్ధంకు నారా లోకేష్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఈ ఆహ్వానంను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల కోరిన విషయం తెలిసిందే. దాంతో ఈ వేడుక పై అందరి దృష్టి పడింది. ఎవరెవరు హాజరు అవుతారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

Also Read: అలాంటి మహిళలు కూడా ఉచిత బస్సు వాడితే బిచ్చమెత్తుకునట్టే.. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..! నిజమే అంటారా..?


End of Article

You may also like