లాక్ డౌన్ ముగిసిన తర్వాత 1948 చట్టం అమలులోకి వస్తుందా? ఆ చట్టం ప్రకారం రూల్ ఇదే.!

లాక్ డౌన్ ముగిసిన తర్వాత 1948 చట్టం అమలులోకి వస్తుందా? ఆ చట్టం ప్రకారం రూల్ ఇదే.!

by Megha Varna

Ads

రోజురోజుకి విజృంభిస్తున్న కరోనా కారణంగా మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నిట్లోనూ లాక్ డౌన్ విధించగా ఒక చైనా మాత్రం కరోనా బారి నుండి బయటపడి యధావిధిగా తన పరిశ్రమలను తెరిచి మొబైల్ పరికరాల నుండి మెడికల్ పరికరాల వరకు అన్ని ఉత్త్పత్తులను మొదలు పెట్టింది ..చైనా ఇప్పుడు కోలుకోవడానికి కూడా అసలు కారణం మూడు నెలలు కఠినంగా విధించిన లాక్ డౌన్ .ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి . భారత్ లో కూడా ఎప్పటినుండో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే .దీంతో సెలెబ్రెటీల దగ్గర నుండి సాధారణ ప్రజల వరుకు ఇంటికే పరిమితం అయ్యారు దీంతో ఉద్యోగులు, కార్మికులు కూడా విధులు చేయడానికి అవకాశం లేక ఇంట్లోనే ఉంటున్నారు.

Video Advertisement

Also Read >>>>పోలీసులు కొట్టేది మాత్రమే మీకు కనిపిస్తుందా.? ఇలాంటివి కనిపించవా? హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్.!

అమెరికా లో కరోనా తీవ్ర స్థాయిలో విజృభించడంతో అక్కడ వేల సంఖ్యలో మరణాలు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అక్కడ పరిస్థితి చేజారిపోయింది .న్యూ యార్క్ ,న్యూ జెర్సీ లో అయితే పరిస్థితి చాల ఘోరంగా తయారు అయ్యింది .దీంతో అమెరికా ఆర్ధిక సంక్షోభంలో పడగా మన దేశంలో యుఎస్ బేస్డ్ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువ ఉండడంతో అమెరికా నుండి ప్రాజెక్ట్స్ ఆగిపోయి ఇంకా భవిషత్తులో వస్తాయో లేదో తెలియక చాలామందికి టెర్మినేషన్ లెటర్స్ ఇచ్చేసారు ..దీంతో భారత్ లో లక్షల సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు .కాగా ఇప్పుడు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నారని వస్తున్న వార్తలపై కొంతమంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ..అసలు లాక్ డౌన్ పొడిగిస్తే ఏమవుతుంది ..వివరాలలోకి వెళ్తే ..

రోజు రోజుకి భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఎక్కడ కూడా తగ్గుముఖం పెట్టకపోవడంతో ఈ లాక్ డౌన్ కొనసాగించడమే మంచిది లేకపోతె కరోనా మరింత ప్రబలిపోతుంది అనే ఆలోచనలో రాష్ట్రాల సీఎం లు ఉన్నారు ..తాజాగా తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ విషయాన్నీ మీడియాతో తెలిపిన విషయం తెలిసిందే .అయితే ఈ లాక్ డౌన్ ను మరో రెండు వారల పాటు కొనసాగించాలి అని రాష్ట్ర సీఎంలు ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో పీఎం ను కోరారు .తెలంగాణాలో మాత్రం లాక్ డౌన్ రెండు వారాలు పొడిగిస్తునట్టు సీఎం కెసిఆర్ చెప్పారు.

ఈ నేపథ్యంలో ఏదో హాయిగా ఇంట్లో కూర్చుని యూట్యూబ్ చూస్తూ ఫ్యామిలీతో సరదాగా గడపచ్చు ఈ పొడిగించడం మన మంచికే అని అనుకుంటున్నారా అయితే ఇక అంతే సంగతులు ..హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం ఈ లాక్ డౌన్ ముగిసిన వెంటనే కేంద్రం 1948 నాటి చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో ఉందంట . ఈ చట్టం ప్రకారం లాక్ డౌన్ ముగిసిన తర్వాత కార్మికులు రోజుకు 12 గంటలు పాటు పరిశ్రమల్లో పని చేయాలనే కఠిన ఆంక్షలు విధించనున్నారు . 21 రోజులు పాటు కంపినీలు అన్ని పని చేయకపోవడంతో  ఉత్త్పత్తులు అన్ని ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉత్త్పత్తులను పెంచేందుకు ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురానున్నారు .

ప్రస్తుతం నిబంధనల ప్రకారం రోజుకు 8 గంటల చొప్పున వారానికి 48 గంటలకు మించి కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగితో పనిచేయించుకోకూడదు. కానీ ఇలాంటి అనుకోని విపత్తు వచ్చినప్పుడు అది సరలించుకోవచ్చు అంట. వారానికి వర్కింగ్ హౌర్స్ 72 గంటల వరకు పొడిగించచ్చు అంట.

Source: hindustantimes

Also Read >>సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించిన…QUANTITATIVE EASING, HELICOPTER MONEY అంటే ఏంటి?


End of Article

You may also like