Ads
ప్రేమ గుడ్డిది. కులాలు, మతాలు, ఆస్తులు అంతస్తులు చూడదూ అంటారు కానీ వారిద్దరు తమ ప్రేమకు ఎల్లలు కూడా లేవని నిరూపించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రానికి చెందిన అబ్బాయి.. ఫ్రాన్స్ దేశానికి అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Video Advertisement
చర్లకు చెందిన రిటైర్డ్ టీచర్ టీవీ చలం, కృష్ణవేణి దంపతుల కుమారుడు అన్వేష్ బెంగళూరులోని మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ కోర్సు చదివాడు. అదే సమయంలో ఫ్రాన్స్ దేశంలోని లాంగ్ విల్ కు చెందిన కెరల్ బెహతుతో అతడికి పరిచయం ఏర్పడింది. కొంత కాలానికే వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
చదువు పూర్తయిన తర్వాత కెరల్ స్వదేశానికి వెళ్లిపోగా.. అన్వేష్ కి కూడా అక్కడే ఉద్యోగం వచ్చింది. అన్వేష్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కెరల్ తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించింది. అలాగే అన్వేష్ తల్లిదండ్రులు కూడా వారి ప్రేమను ఒప్పుకోవడంతో ఆదివారం హైదరాబాద్ మియాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్ హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
representative image
కెరల్ తరపున ఫ్రాన్స్ నుంచి అన్న, వదిన పెళ్ళికి హాజరయ్యారు. ఈ వివాహానికి హైకోర్టు న్యాయమూర్తి ముమ్మనేని సుధీర్బాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కులాలు, మతాలు అని పరువు హత్యలు జరుగుతున్న ఈ రోజుల్లో వీరు దేశాలు వేరైనా.. పెద్దలను ఒప్పించి సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవడంతో పలువురు వీరిని ప్రశంశిస్తున్నారు.
https://www.eenadu.net/telugu-news/districts/Hyderabad/529/122146530
End of Article